ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డికి శివమొగ్గ పేలుళ్ల కేసులో సంబంధం ఉందని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంజునాధ్ అనే వ్యక్తి ఈ పేలుళ్లకు కారకుడు. ఈ కేసులో మంజునాధ్, అతని తండ్రిని అరెస్టు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు భారీ ఎత్తున పేలుడు పదార్ధాలు సప్లై చేస్తున్న వ్యక్తి కాపు రామచంద్రారెడ్డి. రాయదుర్గం నియోజకవర్గం మాఫియా చేతుల్లోకి వెళ్లిపోతోంది’.
‘నియోజకవర్గంలో నాలుగు పేలుడు పదార్ధాల నిల్వలు ఉంటే.. ఒకదానికి మాత్రమే అనుమతి ఉంది. ఇందులో కాపు రామచంద్రారెడ్డి ప్రమేయం ఉంది. కర్ణాటకలో శివమొగ్గ పేలుళ్లు కలకలం రేపాయి. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. లక్ష పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. రామచంద్రారెడ్డి పాత్రపై ఆధారాలు కూడా ఉన్నాయి. దీనిపై సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేస్తాం’ అన్నారు.
994705 646390Excellent post nonetheless , I was wanting to know in case you could write a litte much more on this subject? Id be extremely thankful in the event you could elaborate slightly bit further. Bless you! 275002