కమ్యూనిస్టులు, ప్రాంతీయ పార్టీలు జోరుమీదున్న సమయంలోనూ ఉత్తరతెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ బలంగా నిలిచింది. అలాంటిది ఇప్పుడు పూర్తిగా అస్తిత్వంపైనే అనుమానాలు వ్యక్తమయ్యే పరిస్థితికి చేరుకుంది. టీఆర్ఎస్ దూకుడుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రోజురోజుకూ కుదేలవుతోంది.
వరుసగా ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకునేందుకు క్యూ కట్టడం, కార్యకర్తలు కూడా ఇక దిక్కులేని పరిస్థితుల్లో కాంగ్రెస్కు రాం రాం చెప్పడంతో ఇక ఆ పార్టీ పని అయిపోయినట్లేననే భావన వ్యక్తమైంది. రెండోసారి కేసీఆర్ గెలిచాక పరిస్థితి మరీ దారుణంగా మారింది.
ఒకరిద్దరు సీనియర్ నేతలు మినహా మిగిలిన నేతలు, కార్యకర్తలంతా వస్తున్నారని.. కాంగ్రెస్ ఖాళీ అవుతోదంటూ టీఆర్ఎస్ కూడా ఫీలర్లు వదులుతుండడంతో ఇది జరగక తప్పదేమో అన్న అనుమానం సగటు కాంగ్రెస్ కార్యకర్తలో వ్యక్తమైంది. ప్రజల గుండెల్లోనూ తమ పార్టీకి చోటులేదేమోనన్న అనుమానం కలిగింది.
ఇలాదీనస్థితిలో.. వెంటిలేటర్పై ఉన్నతెలంగాణ కాంగ్రెస్కు ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గెలుపు అమృతపు చుక్కలా మారింది. ఇక పని అయిపోయిందునుకున్న సమయంలో.. కార్యకర్తలకు కొండంత బలాన్నిచ్చింది.
ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్కు ఉన్న బలమైన నేతల్లో జీవన్ రెడ్డి అగ్రగణ్యులు. కమిటెడ్ కార్యకర్తగా.. అనుభవజ్ఞుడైన నేతగా జగిత్యాల నియోజకవర్గాన్ని పార్టీ కంచుకోటగా మార్చారు. పార్టీపై వ్యతిరేకత ఉన్న సమయంలోనూ.. వ్యక్తిగతంగా ఓట్లు సంపాదించే గొప్ప నేత జీవన్ రెడ్డి.
2019 ఎన్నికల్లో ఈయన్ను ఓడించేందుకు టీఆర్ఎస్ చేయని ప్రయత్నమంటూ లేదు. ఏకంగా ఎంపీ కవిత జగిత్యాలలో కూర్చుని తన మనిషి సంజయ్ను గెలిపించుకునేందుకు శ్రమించాల్సి వచ్చింది. అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంతో జీవన్ రెడ్డి కూడా తన పట్టుకోల్పోయారని భావిస్తున్న తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ పార్టీకి వరంగా మారాయి. చివరిసారిగా అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ అద్భుతమైన విజయాన్ని సాధించింది.
ఈ విజయం కేవలం అద్భుతం మాత్రమే కాదు. కాంగ్రెస్ పని అయిపోయిందంటూ గులాబీ దళం చేస్తున్న ప్రచారానికి బ్రేక్ వేసేందుకు పనికొస్తుంది. అంతేకాదు.. టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిపై అఖండ విజయం సాధించడం ద్వారా.. ఇంకా కాంగ్రెస్ జిందా హై అని చెప్పుకునేందుకు.. మళ్లీ పుంజుకుంటామని కార్యకర్తలకు మనోధైర్యం ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది.
తెలంగాణ సమాజంలో నిరుద్యోగులు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఈ ఎన్నికలు బయటపెట్టాయని కాంగ్రెస్ చెబుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ వ్యతిరేకత ఉన్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో ఓటేసే సమయంలోనూ అకౌంట్లలో రైతుబంధు డబ్బులు పడ్డ మెసేజ్ లు తమ విజయానికి బ్రేక్ వేసాయంటోంది.
జీవన్ రెడ్డి పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్త. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీమారే అవకాశం ఉండదు. ఇది పార్టీ శ్రేణులకు ధైర్యాన్నిచ్చే అంశం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసి కాంగ్రెస్లో కనిపించింది. ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తర తెలంగాణ ముఖ్యనేతలు క్షేత్రస్థాయిలో తిరిగారు.
పగలనక, రాత్రనక గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులను కలవడం.. వరుస సమావేశాలు ఏర్పాటుచేసి.. ఓట్లేయాలని కోరడం కలిసొచ్చింది. ఈ ఎన్నికల్లోనూ గెలవకపోతే ఇక పార్టీ పరిస్థితి అంతే పరిస్థితుల్లో బాధ్యతను పంచుకుని ప్రచారం చేశారు. దాని ఫలితమే ఈ రిజల్ట్స్.
ఇది పీసీసీ నేతలకో, అధిష్టానానికో బూస్ట్ ఇచ్చే అంశం అనేకన్నా.. పార్టీ మారడం తప్ప వేరే అవకాశం లేదనుకున్న కేడర్కు వెయ్యిఏనుగుల బలాన్నిచ్చింది. పార్లమెంటు ఎన్నికలకు మరింత ఉత్సాహంతా పనిచేసేందుకు శక్తినిచ్చింది.
946907 355969Wow, fantastic blog layout! How long have you been blogging for? you make blogging appear easy. The overall appear of your web website is great, let alone the content material! 752404