పవర్ స్టార్ పవన్ జనసేన కృష్ణా జిల్లాలో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారనుంది. ఇక్కడ ఉన్న పదహారు అసెంబ్లీ సీట్లలో జనసేన గట్టి అభ్యర్ధులను నిలిపింది. గత ఎన్నికల్లో మాదిరిగా ఈసారి ఏకపక్షంగా సాగే అవకాశాలైతే లేవు. 2014 ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో టీడీపీకి 11 అసెంబ్లీ సీట్లు, రెండు ఎంపీ సీట్లు దక్కాయి. అదే విధంగా వైసీపీకి అయిదు అసెంబ్లీ సీట్లు మాత్రమే లభించాయి. దాంతో ఈసారి రెండు పార్టీలు హోరా హోరీగా పోరాడుతున్నాయి. మధ్యలో వచ్చిన జనసేన తన ఉనికిని బలంగా చాటుకుంటోంది. దాంతో పాటు కొన్ని చోట్ల గెలిచేందుకు కూడా పావులు కదపడంతో టీడీపీ, వైసీపీలలో అలజడి మొదలైంది.
నిజం చెప్పాలంటే అధికార తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా కృష్ణా జిల్లా ఈసారి కలసిరాదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఆ పార్టీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న వాటిలో కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు కూడా ఉంది. రాజధాని ప్రాంతంగా ఈ రెండు జిల్లాల్లో గతంలో కంటే యాక్టివిటి గణనీయంగా పెరగటం..భూముల విలువలు అనూహ్యంగా ఊపందుకోవటం వంటి అంశాలపై టీడీపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మాత్రం టీడీపీ ఆశించిన స్థాయిలో కన్పించటం లేదు. అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ఈ ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో పరిస్థితి ఫిఫ్టీ..ఫిఫ్టీగా కన్పిస్తోంది.
టీడీపీకి ప్రజా వ్యతిరేకత గట్టిగా ఉంది. అదే సమయంలో జనసేన కూడా ఒక్కసారిగా పుంజుకోవడం ఆ పార్టీకి మరిన్ని ఇబ్బందులు గురిచేస్తోంది. జనసేన భారీగా ఓట్లకు కోత పెట్టినా, సీట్లను గెలుచుకున్న దాని వల్ల నష్టపోయేది టీడీపీనే. ఆ పార్టీకి పదకొండు సీట్లు ఇక్కడ ఉన్నాయి. అదే సమయంలో గతంలో గెలిచిన అయిదు సీట్ల నుంచి పైకి ఎగబాకాలనుకుంటున్న వైసీపీకి కూడా జనసేన దూకుడు అంతుపట్టడం లేదంటున్నారు.
ప్రస్తుతానికి వైసీపీనే కొంత ఎడ్జ్ లో కన్పిస్తున్నా…జిల్లాలోని 16 సీట్లలో ఎన్ని సాధిస్తారన్నది తేలడంలేదు. క్షేత్రస్థాయిలో సాగిన పరిశీలన ప్రకారం పక్కాగా వైసీపీ గెలిచే వాటిలో అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, , తిరువూరు, విజయవాడ సెంట్రల్, నందిగామ, మైలవరం నియోజకవర్గాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఇక్కడ అనూహ్యంగా జనసేన ఓటు బ్యాంక్ పెరిగితే మాత్రం వైసీపీ నుంచి చేజారే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
అదే విధంగా సాగునీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరం నియోజకవర్గంలో పోటీ మాత్రం చాలా తీవ్రంగా ఉంది. టీడీపీ గ్యారంటీగా గెలుచుకునే సీట్లలో పెనమలూరు, గన్నవరం, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, కైకలూరు నియోజకవర్గాలు ఉన్నాయి. జగ్గయ్యపేట, పెడనల్లో పోటీ తీవ్రంగా ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఈ సీటు ఎవరు దక్కించుకుంటారో అన్నది ఫలితాల వరకూ సస్పెన్సే. అయితే టీడీపీ తాము ఈ జిల్లాలో అత్యధిక స్థానాలు దక్కించుకుంటామని ధీమాగా ఉన్న తరుణంలో క్షేత్రస్థాయిలో కన్పిస్తున్న సంకేతాలు మాత్రం అందుకు భిన్నంగా ఉండటం ఆసక్తికర పరిణామం.
జనసేన పార్టీ మాత్రం చాప కింద నీరుల తన ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ఆ పార్టీకి నూజివీడు, మచిలీపట్నంలలో గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మిగిలిన చోట్ల డిసైండింగ్ ఫ్యాక్టర్ గా కీలకమైన భూమికను పోషించే వీలు ఉందని తెలుస్తోంది.
very thanks
908545 243392In case you have been injured as a result of a defective IVC Filter, you ought to contact an experienced attorney practicing in medical malpractice cases, specifically someone with experience in these lawsuits. 418455
479360 481373Extremely clean web site , thanks for this post. 818188