ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలకమైన ఆఖరి ఘట్టానికి తెర లేచింది. మరికొద్ది గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ప్రచారం పూర్తిచేసుకున్న పార్టీలు తదుపరి చర్యలకు ఉపక్రమించాయి. ఓటుకు నోటు చెల్లించేశాయి. అన్ని పార్టీలూ ఇదే రూటులో పయనించాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో డబ్బుల పంపిణీ దిగ్విజయంగా పూర్తయింది. ఓటుకు ఒక్కో చోట ఒక్కో రేటు పలికింది. అత్యధికంగా మంగళగిరి ఓటర్లకు గిట్టుబాటు అయినట్టు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో అభ్యర్థులు పోటీపడి మరీ డబ్బులు పంచేశారు. ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు అందజేశారు. ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పుల ఆధారంగా ఎన్ని ఓట్లు ఉంటే అంత మేర లెక్క కట్టి చెల్లించేశారు. అక్కడక్కడా కొంతమంది నిర్ద్వందంగా తమకు అలాంటి డబ్బు అవసరం లేదని చెప్పగా.. చాలామంది ఇచ్చిన ప్రతి పార్టీ దగ్గరా డబ్బులు తీసుకున్నారు. డబ్బు పంపిణీలో అధికార తెలుగుదేశం పార్టీతో ప్రత్యర్ధి పార్టీలు తూగలేకపోయాయి.
అన్ని పార్టీలూ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ, అధిక మొత్తం మాత్రం తెలుగుదేశం పార్టీయే చెల్లించింది. వైఎస్సార్ సీపీ అభ్యర్థులు రూ.వెయ్యి పంచినచోట తెలుగుదేశం పార్టీ రూ.1500 అందజేసింది. వైఎస్సార్ సీపీ రూ.1500 ఇస్తే, తెలుగుదేశం పార్టీ రూ.2వేలు చెల్లించింది. కొన్నిచోట్ల మహిళలకు చీరలు, ఫోన్లు పంచినట్టు సమాచారం. డబ్బులు లేకుండా రాజకీయాలు చేయలేమా అంటూ ప్రశ్నించిన జనసేన కూడా డబ్బు పంపిణీ చేయడం గమనార్హం.
అయితే, ఆ పార్టీకి పరిమితి ఆర్థిక వనరులు మాత్రమే ఉండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులతో ఈ విషయంలో పోటీపడలేకపోయినట్టు సమాచారం. అందుకే రూ.500 వరకు ఆ పార్టీ చెల్లించినట్టు చెబుతున్నారు. కాగా, డబ్బుల పంపిణీలో పార్టీలు వినూత్న పద్ధతులు అవలంభించాయి. పెద్దగా సమస్యలేని చోట్ల నేరుగా ఇళ్లకే వెళ్లి, ఆ ఇంట్లో ఓట్ల సంఖ్యను బట్టి నగదు అందజేయగా.. కొన్నిచోట్ల ఓటరు స్లిప్పులతోపాటు కూపన్లు పంచిపెట్టారు. అనంతరం వాటిని తీసుకుని వారు నిర్దేశించిన ప్రాంతానికి వెళ్లినవారికి నగదు ముట్టజెప్పారు.
అత్యధికంగా మంగళగిరి నియోజకవర్గంలో పంపిణీ జరిగిందని అంటున్నారు.అక్కడ సీఎం తనయుడు నారా లోకేశ్ పోటీలో ఉన్న నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గాన్ని టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముందు నుంచి పక్కా వ్యూహం ప్రకారమే అక్కడ ముందుకెళ్లింది. ఓట్లు వేయించగల చోటా నేతలకు ముందుగానే గాలం వేసింది. వారికి పెద్ద మొత్తంలో తాయిలాలు ముట్టజెప్పి తనవైపు తిప్పుకుంది. అనంతరం వారి ద్వారా తతంగం నడిపించినట్టు సమాచారం. ఓటుకు ఏకంగా రూ.5 వేల వరకు ఇచ్చిందని అంటున్నారు. కొంతమందికి వస్తు రూపేణా అందజేసినట్టు చెబుతున్నారు. ఐదు ఓట్లు ఉన్న ఇంటికి ఎల్ఈడీ టీవీ లేదా ఫ్రిజ్ వంటి ఉత్పత్తులు ఇచ్చారని తెలిసింది. ఇందుకోసం ప్రత్యేక కూపన్లు ఇచ్చారు. వాటిని తీసుకుని తాడేపల్లిలోని ఓ షోరూంలో ఇస్తే, సదరు వస్తువు ఇచ్చే ఏర్పాటు చేశారని అంటున్నారు.
ఇప్పటికే చాలాచోట్ల తాయిలాల పంపిణీ పూర్తికాగా, మిగిలిన ప్రాంతాల్లో బుధవారం రాత్రి ఈ తతంగం పూర్తి చేయడానికి రంగం సిద్దం చేసుకున్నారు. ఓటర్లు మాత్రం పక్కా క్లారిటీతో ఉన్నారు. అన్ని పార్టీల దగ్గరా సొమ్ము తీసుకున్నప్పటికీ, చివరకు తమకు నచ్చిన పార్టీకే ఓటు వేయాలని డిసైడ్ అయిపోయారు.
262486 460978Awesome weblog, Im going to spend more time researching this subject 936830
209623 79711Excellent paintings! This is the kind of information that really should be shared around the web. Disgrace on Google for now not positioning this publish upper! Come on more than and speak more than with my site . Thanks =) 311975
516015 476164An intriguing discussion is worth comment. I believe that you really should write a lot more on this topic, it may not be a taboo topic but generally individuals are not enough to speak on such topics. To the next. Cheers 903467
126362 784305the most common table lamp these days still use incandescent lamp but some of them use compact fluorescent lamps which are cool to touch.. 355651
773728 227114But wanna say that this really is invaluable , Thanks for taking your time to write this. 488315