ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ముగిసింది. అభ్యర్థులు ఖర్చు ఎంత అయిందో లెక్కలు వేసుకుంటున్నారు. అయితే, జనసేన అభ్యర్థులు మాత్రం ఇలాంటి లెక్కలకు దూరంగా ఉన్నారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన జనసేన.. ఎన్నికల్లో డబ్బులు పంచకపోవడమే ఇందుకు కారణం. డబ్బులు పంచితేనే రాజకీయాల్లో మనగలం అనే ఒరవడికి స్వస్తి పలకాలనే ఉద్దేశంతో, రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో రాజకీయారంగేట్రం చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ విషయంలో ముందుగానే తన వైఖరిని స్పష్టంచేశారు. డబ్బులు పంచడం అనే దుస్సంప్రదాయానికి తాను వ్యతిరేకినని, ఎన్నికల్లో ఎవరూ కూడా డబ్బులు పంచొద్దని అభ్యర్థులకు స్పష్టంచేశారు. చెప్పినట్టుగానే ఆయన పోటీ చేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో డబ్బుల్లేని రాజకీయాలు చేసి చూపించారు.
అలాగే, జనసేన నుంచి పోటీచేసిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది అధినేత ఆదేశాలను పాటించారు. ఒకటి రెండు చోట్ల మాత్ర జనసేన అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీలతో పోటీపడి డబ్బులు పంచినట్టు సమాచారం. అయితే, ఇది తమ అధినేతకు తెలియకుండా, తాము డబ్బులు పంచకపోతే ఎక్కడ ఓడిపోతామనే భయంతో ఆయా అభ్యర్థులు వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం. ఈ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ సీపీలు చాలా చోట్ల ఓటర్లకు డబ్బులు పంచాయి. రూ.500 నుంచి రూ.5000 వరకు ఓటర్లకు ముట్టజెప్పాయి. ఓటర్లు కూడా రెండు పార్టీల దగ్గరా డబ్బులు తీసుకున్నారు. అయితే, డబ్బులు తీసుకోకుండా ఓటేసింది మాత్రం జనసేన ఓటర్లే. అంటే ఒకవిధంగా అమ్ముడుపోని ఓటర్లు ఎవరైనా ఉన్నారా అంటే అది జనసేన ఓటర్లే అని చెప్పొచ్చు.
టీడీపీ, వైఎస్సార్ సీపీల్లోనూ డబ్బులు తీసుకోకుండా ఓటేసినవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఆయా పార్టీల మీద ఉన్న అభిమానంతో వారు ఓటేసినప్పటికీ, ఆయా పార్టీలకు పడిన ఓట్లలో డబ్బులు తీసుకుని వేసినవి కూడా ఉన్నాయి. ఒక్క జనసేనకు పడిన ఓట్లు మాత్రం ఒక్క పైసా కూడా తీసుకుకోండా వేసినవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ పార్టీ డబ్బులు పంచలేదు. అంటే, ఈ ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓట్లన్నీ పూర్తి స్వచ్ఛందంగా వచ్చిన అమ్ముడుపోని ఓట్లు.
పైగా ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్నవారంతా స్వచ్ఛందంగా సొంత డబ్బులు ఖర్చుపెట్టుకుని మరీ వచ్చి జనసేనకు ఓటేశారు. ‘మా ఊళ్లో టీడీపీ, వైసీపీలు చెరో రూ.వెయ్యి పంచాయి. మేం మాత్రం హైదరాబాద్ నుంచి రూ.2వేలు పెట్టి టికెట్ కొని ఓటేయడానికి వచ్చాం. జీరో బడ్జెట్ పాలిటిక్స్ కు పవన్ శ్రీకారం చుట్టారు. రాజకీయాల్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్న అలాంటివారిని ప్రోత్సహించాలి. ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటును కొనాలని రాజకీయాలు పార్టీలు భావించడం ఎంత తప్పో, ఓటును అమ్ముకోకూడదని తెలిసి కూడా పార్టీల దగ్గర డబ్బులు తీసుకుంటున్న జనాలది అంతకంటే తప్పు’ అని విజయవాడకు చెందిన రాజు చెప్పాడు.
జనసేనకు పడిన ఓట్లన్నీ ఎలాంటి ప్రలోభాలకూ గురికానివేనని, తమవి అమ్ముడుపోని ఓట్లని గర్వంగా కాలర్ ఎగరేసి మరీ చెప్పాడు. మరి రాజకీయాల్లో మార్పు కోసం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన జనసేనకు ఈ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయో తెలియాలంటే మే 23 వరకు వేచిచూడక తప్పదు.
471537 393005When do you think this Real Estate market will go back in a positive direction? Or is it nonetheless too early to tell? We are seeing a great deal of housing foreclosures in Altamonte Springs Florida. What about you? Would adore to get your feedback on this. 809689
545658 80669magnificent submit, extremely informative. I ponder why the opposite experts of this sector dont realize this. You ought to proceed your writing. Im sure, youve a terrific readers base already! 664054
831733 400648Glad to be one of several visitants on this awful website : D. 176380
223091 275591I havent checked in here for some time because I thought it was getting boring, but the last couple of posts are really good quality so I guess Ill add you back to my daily bloglist. You deserve it my friend. insurance guides 522892