రాజులు పోయారు.. రాజ్యాలూ పోయాయి.. కానీ, ప్రస్తుతం మళ్ళీ రాజకీయ నాయకులే రాజుల అవతారమెత్తుతున్నారు. ‘చక్రవర్తులు’గా పరిపాలించేయాలనుకుంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాచరిక పోకడలకు తావు లేదు. కానీ, ఇప్పుడు నడుస్తున్నది రాజకీయస్వామ్యమే.. అంటే, ఆనాటి రాచరిక పాలనేనడానికి కొన్ని సాక్ష్యాలు తెరపైకొస్తున్నాయి.
కొన్నాళ్ళ క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మల్ని, ఏకంగా.. యాదాద్రి ఆలయ గోడలపై చెక్కేశారు. అయితే, ఆ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలత చెందారు. హుటాహుటిన ఆ చెక్కిన విగ్రహాల రూపు మార్చెయ్యాలని ఆదేశించారు. ఇక, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి విగ్రహాల్ని చెక్కేస్తున్నారు. రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న సమగ్ర భూ సర్వేకి సంబంధించి సరిహద్దు రాళ్ళను వైఎస్ జగన్ బొమ్మలతో డిజైన్ చేయిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నంతోపాటు, వైఎస్ జగన్ బొమ్మ కూడా వుండేలా సరిహద్దు రాళ్ళను చెక్కిస్తున్నారు. ఇదెక్కడి వింత.? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా.. అది ప్రజల జేబుల్లోంచి ఖర్చయ్యే వ్యవహారమే. మరి పాలకుల బొమ్మలెందుకు పెడతారు.? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకదు. గతంలో రాజన్న, చంద్రన్న కూడా ఈ తరహా పోకడలతో జనానికి విసుగు తెప్పించారు.
వాళ్ళు కాకపోతే వీళ్ళు.. వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు.. తేడాలేం వుండవు. రాజకీయం ఏమీ మారదు. మహనీయుల విగ్రహాలేమో ద్వంసమవుతాయ్.. అధికారంలో వున్నోళ్ళ విగ్రహాలు, ఫొటోలకు మాత్రం విపరీతమైన పబ్లిసిటీ. హద్దు రాళ్ళ కోసం చేస్తోన్న డిజైన్ల కోసం ఎంత ఖర్చవుతోందట.? ప్రస్తుతానికైతే ఆ లెక్కలు బయటకు రాలేదుగానీ.. ఈ బొమ్మలు చెక్కించుకునే పైత్యమేంటి మహాప్రభో.? అంటూ జనం ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. ఆయా వ్యక్తులక ఆ ‘ఆలోచన’ వుంటుందా.? అన్న విషయం పక్కన పెడితే, వారి అనుచరుల అత్యుత్సాహమే ఈ అనర్ధాలకు కారణం. పూటకో పార్టీ మార్చే నేతలు, అనుచరులు.. ఈ తరహా భజన కార్యక్రమాలు చేస్తోంటే, జనమే.. వెర్రి వెంగళప్పల్లా అన్నీ భరించాల్సి వుంటుందన్నమాట.
194729 547693Pretty! This was a truly fantastic post. Thank you for your provided information. cool desktop 460005
820675 667178Wow! This could be 1 specific with the most useful blogs Weve ever arrive across on this topic. Actually Great. Im also an expert in this topic therefore I can understand your hard work. 228002