ఏపీలో కూల్చివేత రాజకీయాలు కొనసాగుతున్నాయి. కరకట్టపై అక్రమంగా నిర్మించారనే కారణంతో రూ.9 కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రజావేదికను రూ.20 లక్షలు ఖర్చుపెట్టి మరీ కూల్చివేసిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని ఎస్టేట్స్ భవనాన్ని కూల్చివేసే లక్ష్యంతోనే ప్రజావేదికను జగన్ కూల్చివేయించారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో కరకట్టపై అక్రమంగా ఉన్న పలు భవనాలు, నిర్మాణాలకు ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. వారిలో కొంతమంది కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకున్న నేపథ్యంలో తదుపరి అడుగులు ముందుకు పడలేదు.
ఓ దశలో చంద్రబాబు ఉంటున్న భవనాన్ని కూల్చివేస్తున్నారంటూ గట్టిగానే ప్రచారం జరిగినా.. అది నిజం కాదని తేలింది. తాజాగా జగన్ సర్కారు దృష్టి మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వైపు మళ్లినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిలో టీడీపీ ప్రధాన కార్యాలయం నిర్మించాలనే ఉద్దేశంతో మంగళగిరిలో స్థలాన్ని ఎంపిక చేశారు. మొత్తం 4.51 ఎకరాల స్థలంలో గతేడాది డిసెంబర్ లో భవన నిర్మాణం ప్రారంభించారు. అది దాదాపుగా పూర్తి కావొచ్చింది.
వచ్చే నెలలో ప్రారంభోత్సవం చేయడానికి కూడా టీడీపీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో అది అక్రమ నిర్మాణమని, వారం రోజుల్లోగా కూల్చివేయకుంటే తామే కూలుస్తామంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ పోరంబోకు స్థలంతోపాటు ప్రైవేటు వ్యక్తులకు పట్టాలు చేసి ఇచ్చిన స్థలాన్ని ఆక్రమించుకుని మరీ ఆ భవనాలు నిర్మిస్తున్నారని అందులో పేర్కొంది. అయితే, తమను రాజకీయంగా వేధించేందుకు సర్కారు ఇలా నోటీసులు జారీ చేసిందని, తమ పార్టీ కార్యాలయ నిర్మాణానికి అన్ని అనుమతులూ ఉన్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై కోర్టుకు వెళ్లాలనే యోచనలో వారు ఉన్నట్టు తెలుస్తోంది.
243777 769209I respect your piece of function, appreciate it for all the interesting content . 99921
615220 829798Aw, it was a quite very good post. In thought I would like to devote writing such as this furthermore,?C spending time and specific function to produce a great article?- nonetheless so what can I say?- I waste time alot and never at all appear to obtain one thing completed. 940645