ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో అగ్రపథాన నిలపడమే తన లక్ష్యమని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంచేశారు. ‘‘పారదర్శకమైన పాలనతో నూతన సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ, అవినీతిలేని, వికేంద్రీకరణతో కూడి ప్రభుత్వంతో, మీ ఇంటివద్దే పాలన అందేలా, స్థిరమైన అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ ను అగ్రభాగంలో నిలపడమే ఏపీకి సంబంధించి నా విజన్’’ అని జగన్ ట్వీట్ చేశారు.
కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా బాబుపై నిప్పులు చెరిగారు. 30 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. చివరు అక్షరాస్యతలో కూడా ఈ నియోజకవర్గం వెనబడి ఉందన్నారు. రాష్ట్రంలో 67 శాతం అక్షరాస్యత ఉండగా, కుప్పంలో అది 61.8 శాతమేనని తెలిపారు. కనీసం ప్రాథమిక విద్య కూడా సరిగా అందని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని విమర్శించారు.
ఇక్కడి పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి చంద్రబాబు ముందుకు రాలేదని దుయ్యబట్టారు. వైఎస్ హయాంలో శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టు పూర్తయితే, తనకు పేరు ఏమీ ఉండదని భావించి తమిళనాడు ప్రభుత్వంతో చేతులు కలిపి ప్రాజెక్టును అడ్డుకున్నారని ఆరోపించారు. వైఎస్సార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలను ఈ సర్కారు అటకెక్కించిందని మండిపడ్డారు.
ఇక్కడి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ రాకపోవడంతో కూలి పనుల కోసం బెంగళూరుకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే ఆరోగ్య శ్రీ కార్డు కూడా ఇప్పుడు ఎందుకూ పనికిరాకుండా పోయిందని పేర్కొన్నారు. 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. కనీసం తన సొంత నియోజకవర్గంలో కూడా దానిని అమలుచేయడంలేదని జగన్ తూర్పారబట్టారు.
సొంత తమ్ముడినే చిన్నచూపు చూసిన చంద్రబాబు.. రాష్ట్రప్రజలకు పెద్దన్నలా ఎలా ఉంటారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సంగం వాటా ఇవ్వాలని చట్టం చేస్తే.. తల్లి పేరున ఉన్న ఆస్తిని తమ్ముళ్లు, చెల్లెళ్లకు పంచకుండా.. కొడుకు పేరున రాయించారని విమర్శించారు. సొంత తమ్ముడికి, చెల్లెల్లకు, పిల్లినిచ్చిన మామకే వెన్నుపొడిచిన వ్యక్తి రాష్ట్రప్రజలకు పెద్దకొడుకు ఎలా అవుతాడన్నారు?
చరిత్రలో డ్వాక్రా అక్కాచెల్లెమ్మలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని స్పష్టంచేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పసుపు కుంకుమ పేరిట కొత్త సినిమా చూపిస్తున్నారని దుయ్యబట్టారు. సొంత కుటుంబ సభ్యులనే దారుణంగా మోసం చేసిన చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని ప్రజలను కోరారు.
హరికృష్ణ భౌతికకాయం సాక్షిగా రాజకీయాలు చేశారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. సొంత బావమరిది మృతదేహాన్ని పక్కన ఉంచుకుని టీఆర్ఎస్ తో పొత్తు కోసం కేటీఆర్ తో మాట్లాడారని, అది కుదరకపోవడంతో ఇప్పుడు కేసీఆర్ ను బూచిగా చూపిస్తూ జనాన్ని రెచ్చగొడుతున్నారని జగన్ మండిపడ్డారు. అలాంటి వ్యక్తిని నమ్మి మరోసారి మోసపోవద్దని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, నవరత్నాలతో అందరి జీవితాల్లోనూ కొత్త వెలుగులు నింపుతామని జగన్ భరోసా ఇచ్చారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఐఏస్ అధికారి చంద్రమౌళిని గెలిపించాలని కోరారు.
758244 98477Hi. Cool post. There is really a dilemma with the internet internet site in firefox, and you may want to test this The browser is the marketplace leader and a huge portion of folks will miss your excellent writing due to this dilemma. 187141
925994 524052In case you happen to significant fortunate men and women forms, referring by natural indicates, in addition you catch the attention of some sort of envy in consideration of those types the other campers surrounding you which have tough times about this topic. awnings 142301