Switch to English

ఏపీని అగ్రపథాన నిలపడమే నా విజన్: జగన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో అగ్రపథాన నిలపడమే తన లక్ష్యమని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంచేశారు. ‘‘పారదర్శకమైన పాలనతో నూతన సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ, అవినీతిలేని, వికేంద్రీకరణతో కూడి ప్రభుత్వంతో, మీ ఇంటివద్దే పాలన అందేలా, స్థిరమైన అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ ను అగ్రభాగంలో నిలపడమే ఏపీకి సంబంధించి నా విజన్’’ అని జగన్ ట్వీట్ చేశారు.

కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా బాబుపై నిప్పులు చెరిగారు. 30 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. చివరు అక్షరాస్యతలో కూడా ఈ నియోజకవర్గం వెనబడి ఉందన్నారు. రాష్ట్రంలో 67 శాతం అక్షరాస్యత ఉండగా, కుప్పంలో అది 61.8 శాతమేనని తెలిపారు. కనీసం ప్రాథమిక విద్య కూడా సరిగా అందని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని విమర్శించారు.

ఇక్కడి పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి చంద్రబాబు ముందుకు రాలేదని దుయ్యబట్టారు. వైఎస్ హయాంలో శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టు పూర్తయితే, తనకు పేరు ఏమీ ఉండదని భావించి తమిళనాడు ప్రభుత్వంతో చేతులు కలిపి ప్రాజెక్టును అడ్డుకున్నారని ఆరోపించారు. వైఎస్సార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలను ఈ సర్కారు అటకెక్కించిందని మండిపడ్డారు.

ఇక్కడి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ రాకపోవడంతో కూలి పనుల కోసం బెంగళూరుకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే ఆరోగ్య శ్రీ కార్డు కూడా ఇప్పుడు ఎందుకూ పనికిరాకుండా పోయిందని పేర్కొన్నారు. 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. కనీసం తన సొంత నియోజకవర్గంలో కూడా దానిని అమలుచేయడంలేదని జగన్ తూర్పారబట్టారు.

సొంత తమ్ముడినే చిన్నచూపు చూసిన చంద్రబాబు.. రాష్ట్రప్రజలకు పెద్దన్నలా ఎలా ఉంటారని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ మహిళలకు ఆస్తిలో సంగం వాటా ఇవ్వాలని చట్టం చేస్తే.. తల్లి పేరున ఉన్న ఆస్తిని తమ్ముళ్లు, చెల్లెళ్లకు పంచకుండా.. కొడుకు పేరున రాయించారని విమర్శించారు. సొంత తమ్ముడికి, చెల్లెల్లకు, పిల్లినిచ్చిన మామకే వెన్నుపొడిచిన వ్యక్తి రాష్ట్రప్రజలకు పెద్దకొడుకు ఎలా అవుతాడన్నారు?

చరిత్రలో డ్వాక్రా అక్కాచెల్లెమ్మలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని స్పష్టంచేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పసుపు కుంకుమ పేరిట కొత్త సినిమా చూపిస్తున్నారని దుయ్యబట్టారు. సొంత కుటుంబ సభ్యులనే దారుణంగా మోసం చేసిన చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని ప్రజలను కోరారు.

హరికృష్ణ భౌతికకాయం సాక్షిగా రాజకీయాలు చేశారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. సొంత బావమరిది మృతదేహాన్ని పక్కన ఉంచుకుని టీఆర్ఎస్ తో పొత్తు కోసం కేటీఆర్ తో మాట్లాడారని, అది కుదరకపోవడంతో ఇప్పుడు కేసీఆర్ ను బూచిగా చూపిస్తూ జనాన్ని రెచ్చగొడుతున్నారని జగన్ మండిపడ్డారు. అలాంటి వ్యక్తిని నమ్మి మరోసారి మోసపోవద్దని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, నవరత్నాలతో అందరి జీవితాల్లోనూ కొత్త వెలుగులు నింపుతామని జగన్ భరోసా ఇచ్చారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఐఏస్ అధికారి చంద్రమౌళిని గెలిపించాలని కోరారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

రాజకీయం

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఎక్కువ చదివినవి

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...