Switch to English

బ్రాండ్‌ చంద్రబాబు: అమరావతిపై జగన్‌ ‘కినుక’కి కారణమిదేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, అమరావతిని ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ప్రకటించే క్రమంలో ఏకపక్ష నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం. రాజధాని, రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలనూ కలుపుకుపోయి వుండాల్సింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. అయితే, ‘ప్రభుత్వం తరఫున ప్రతిపక్షాన్ని కలుపుకుపోయేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అందుకు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సహకరించలేదు..’ అన్నది టీడీపీ వెర్షన్‌. కానీ, ‘పెద్దన్న’ పాత్ర పోషించాల్సిన చంద్రబాబు, ‘అహంకారం’ ప్రదర్శించారు.. దాంతో, వైఎస్‌ జగన్‌ ‘అహం’ దెబ్బతింది. ఇదే, ఇఫ్పుడు అమరావతికి ‘మరణ శాసనం’గా మారిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

‘అమరావతి అభివృద్ధిని మా ప్రభుత్వం అడ్డుకోదు. అమరావతికి సమాంతరంగా విశాఖ, కర్నూలు కూడా రాజధానులుగా అభివృద్ధి చెందుతాయి..’ అని వైసీపీ నేతలు చెబుతున్నా, పరిస్థితి తీవ్రత ఏంటో వాళ్ళకి అర్థం కాదని ఎలా అనుకోగలం.? ఇక, తాజా పరిణామాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ మాట్లాడుతూ, చంద్రబాబు అమరావతిని తన ‘సొంత బ్రాండ్‌’గా ప్రమోట్‌ చేసుకున్నారనీ, దాంతో అమరావతి పట్ల వైఎస్‌ జగన్‌లో అసహనం పెరిగి వుండొచ్చని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో అమరావతికి ‘జై’ కొట్టిన వైఎస్‌ జగన్‌, ఇప్పుడు ఆ అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలించడం సబబు కాదని నాగేశ్వర్‌ చెప్పుకొచ్చారు.

అయితే, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్లో రాజధానికి సంబంధించి కేంద్రం జోక్యం చేసుకునే పరిస్థితి వుండదని అంటున్నారు నాగేశ్వర్‌. ఫెడరల్‌ వ్యవస్థలో ఓ రాష్ట్ర రాజధాని విషయమై కేంద్రం స్పందించడం జరగకపోవచ్చన్నది నాగేశ్వర్‌ చెబుతున్న మాట. ఇక, ‘బ్రాండ్‌ అమరావతి – బ్రాండ్‌ చంద్రబాబు’ విషయానికొస్తే.. నాగేశ్వర్‌ వ్యాఖ్యల్లో నూటికి నూరుపాళ్ళూ వాస్తవం లేకపోలేదు. ‘సంక్షోభాల్ని అవకాశాలుగా మలచుకుంటాను.. రాజధానిని నిర్మిస్తాను..’ అని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు, వాస్తవ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకోకుండా, అంతర్జాతీయ స్థాయి రాజధాని.. అంటూ అటు కేంద్రాన్ని కూడా లెక్కచేయలేదన్నది నిర్వివాదాంశం.

ఇలా ఎలా చూసినా, చంద్రబాబు బ్రాండ్‌.. ఇప్పుడు రాష్ట్రానికి పెను నష్టం వాటిల్లేలా చేస్తోంది. మొత్తమ్మీద, చంద్రబాబు మీద అక్కసుతో.. అమరావతికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ‘వెన్నుపోటు’ పొడుస్తున్నారన్న ప్రచారంలోనూ వాస్తవం లేకపోలేదన్నమాట.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...