రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ‘పెగాసస్ సాఫ్ట్ వేర్’ అంశంపై సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘నేను నిఘా విభాగాధిపతిగా ఉన్నంత కాలం.. మే 2019 వరకు ఏ ప్రభుత్వ సంస్థ పెగాసెస్ కొనలేదు. మే 2019 తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. పెగాసస్పై వస్తున్న సందేహాలను నివృత్తి చేయడం నా బాధ్యతగా భావిస్తున్నా. నాపై ఆరోపణలు టైమ్ వేస్ట్. నన్ను ఇరికించేందుకు కొందరు అధికారులు తప్పుడు పత్రాలతో విఫలయత్నాలు చేస్తున్నారు’.
‘పెగాసస్ కొనలేదని ఇప్పటికే డీజీపీ కార్యాలయం తెలిపింది. 30 ఏళ్ళపాటు దేశం కోసం ప్రాణాలను లెక్క చేయకుండా పనిచేశా. నా వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్న వారిపై పరువు నష్టం దావా వేసేందుకు అనుమతి కోరా. ప్రజల భయాలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. గత ప్రభుత్వ హయాంలో ఎవరి ఫోన్లు ట్యాప్ కాలేదు.. అందరూ నిశ్చితంగా ఉండండి. గత ప్రభుత్వంలో నిఘా ఛీఫ్గా ఉన్నందున నాకు పూర్తి సమాచారం ఉంది’ అని అన్నారు.
447959 598222Oh my goodness! an wonderful post dude. Thank you Even so My business is experiencing issue with ur rss . Dont know why Unable to subscribe to it. Can there be anyone obtaining identical rss difficulty? Anybody who knows kindly respond. Thnkx 655518
452996 394609excellent post. Neer knew this, thankyou for letting me know. 167087