తెలంగాణలో గతంలో ఓసారి మార్చిన ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మరోసారి మారనుంది. జేఈఈ మెయిన్ తేదీలను జాతీయ పరీక్షల మండలి మార్చడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. కొత్త షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ 6కు బదులుగా 21 నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఈమేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్ షెడ్యూల్ మార్చాల్సి ఉంటుందని అన్నారు.
నీట్ తేదీని ఇంకా ప్రకటించకపోవడంతో.. ఆ షెడ్యూల్ ను కూడా పరిశీలించి కొత్త తేదీలపై స్పష్టతనిస్తామని బోర్డు తెలిపింది. పక్కపక్క తేదీల్లో జేఈఈ, ఇంటర్ పరీక్షలు రాయడం వల్ల విద్యార్ధులు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందంటున్నారు.
ఇంటర్ రెండు సంవత్సరాలకు మే 5 నుంచి పరీక్షలు నిర్వహిస్తే.. మే 20కి పూర్తవుతాయని.. మూడు రోజులకు ప్రారంభమయ్యే జేఈఈ మెయిన్ చివరి విడత పరీక్షలకు సిద్ధమయ్యేందుకు విద్యార్ధులకు సమయం సరిపోదని అంటున్నారు. ఈక్రమంలో అధికారులు అన్ని అంశాలు పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు.
జేఈఈ మెయిన్ కొత్త తేదీలు: ఏప్రిల్ 21, 24, 25, 29. మే 1, 4