విశాఖపట్నానికి ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ రాబోతోంది. నగరంలో క్యాంపస్ ఏర్పాటు చేసుందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో ఐటీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ఫోసిస్ రాకతో ఉత్తరాంధ్రకు చెందిన పలువురికి ఇక్కడే ఉద్యోగాలు పొందనున్నారు. ఇప్పటివరకూ ఇక్కడి వారు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు వెళ్తున్నారు.
ద్వితీయ శ్రేణి నగరాల్లో క్యాంపస్ ఏర్పాటు చేయాలని భావించిన ఇన్ఫోసిస్.. దేశవ్యాప్తంగా తాను ఎంచుకున్న నాలుగు నగరాల్లో విశాఖ ఒకటి. ఈ ఏడాది సెప్టెంబరులోపు విశాఖలో కార్యాలయం ఏర్పాటు చేస్తామని.. వెయ్యి మంది ఉద్యోగులకు అవకాశం ఉంటుందని తెలిపింది. నాలుగు నగరాల్లో ఏర్పాటు చేస్తున్న కార్యాలయాలను టాలెంట్ పూల్ హబ్లుగా అభివృద్ధి చేస్తామని.. దశల వారీగా పెట్టుబడులు పెంచుతామని అంటోంది.
సిబ్బందికి అవసరమైన నైపుణ్యం కోసం స్కిల్ డెవల్పమెంట్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. కార్యాలయాన్ని మధురవాడలోని ఐటీ హిల్స్ లేదా విశాలమైన ప్రాంగణం ఉన్న భవనంలో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనిపై అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.
6246 3137Some really good stuff on this internet site , I enjoy it. 698770