తెలుగు రాజకీయాల్లో తమదైన ముద్రవేసిన నాయకులు చంద్రబాబు నాయుడు మరియు వైఎస్సార్. వీరిద్దరు కూడా తెలుగు ప్రజలను ముఖ్యమంత్రులుగా పరిపాలించారు. వీరిద్దరు కూడా బద్ద శత్రువులుగా మాత్రమే అందరికి తెలుసు. కాని వీరిద్దరు రాజకీయాలు ప్రారంభించిన సమయంలో మంచి మిత్రులు అని మాత్రమే కొందరికి తెలుసు. వీరిద్దరు కూడా కాంగ్రెస్లో వీరి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ సమయంలో వీరిద్దరి మద్య మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవని చాలా మంది అంటూ ఉంటారు. బాబు టీడీపీలోకి వెళ్లిన తర్వాత ఇద్దరు కూడా బద్ద శత్రువులుగా మారిపోయారు.
వీరిద్దరి శత్రుత్వం గురించి ఇప్పటికే పలు సినిమాల్లో చూపించారు. కాని వీరిద్దరి స్నేహం గురించి తాను చూపిస్తానంటూ దేవ కట్టా ముందుకు రాబోతున్నాడు. ఇంద్రప్రస్థం అనే టైటిల్తో ఈ సినిమాను రూపొందించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రీ లుక్ ను విడుదల చేశారు. ఇందులో చంద్రబాబు నాయుడు మరియు వైఎస్సార్లను చూపించాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాను అతి త్వరలో పట్టాలెక్కించాలని ఈయన తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
హర్ష వి మరియు తేజ వి లు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న దర్శకుడు దేవా కట్టా ఇప్పటికే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఇంద్రప్రస్థం సినిమాను మొదలు పెడతాడా లేదంటే రెండు సమాంతరంగా ఈసినిమాను చేస్తాడా అనేది చూడాలి.
547738 996859Some really useful info in there. Why not hold some sort of contest for your readers? 461302