అల్లుడు శీను సినిమాతో హీరోగా పరిచయం అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించాడు. అయితే ఇప్పటి వరకు ఆయన కమర్షియల్ గా బిగ్గెస్ట్ సక్సెస్ ను మాత్రం దక్కించుకోలేక పోయాడు. అయినా కూడా ఆఫర్ల విషయంలో మాత్రం ఆయనకు కొదువ లేదు అన్నట్లుగా ఉంది. ఈయన ఏకంగా తెలుగు సూపర్ హిట్ మూవీ చత్రపతి ని హిందీలో చేసేందుకు సిద్దం అవుతున్నాడు. హిందీ రీమేక్ కు వి వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ సినిమా లో మొదట కియారా అద్వానీ హీరోయిన్ గా నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా అనన్య పాండే పేరు వినిపిస్తుంది.
బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉన్న అనన్య పాండే ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ డంను అనన్య పాండే దక్కించుకోవడం ఖాయం అంటున్నారు. అందుకే చత్రపతి రీమేక్ కు ఆమెను సంప్రదించారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరి ఆమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ఓకే చెప్పనుందా లేదా అనేది చూడాలి.
88539 547112I saw a lot of site but I believe this 1 contains something unique in it in it 262729
148884 104913Howdy! Would you mind if I share your weblog with my twitter group? Theres plenty of people that I feel would really enjoy your content material. Please let me know. Thanks 461217