విశాఖపట్నం పోటెత్తింది.. జన సంద్రాన్ని తలపించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ టూర్కి కనీ వినీ ఎరుగని రీతిలో జన సమీకరణ చేపట్టాయి వైసీపీ శ్రేణులు. నిజానికి, ఈ స్థాయిలో జన సంద్రాన్ని చూడటం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొత్తేమీ కాదు. పాదయాత్రలో అయినా, అంతకు ముందు చేపట్టిన ఏ కార్యక్రమానికైనా.. ఈ స్థాయిలో, ఇంతకు మించి కూడా జన సంద్రాన్ని సృష్టించారు వైఎస్ జగన్.
అంచనాలకు మించి జనాన్ని వైఎస్ జగన్ ప్రతిసారీ ఎలా రాబడుతున్నారు.? అన్న ప్రశ్నకు సమాధానం అందరికీ తెల్సిందే. గ్రౌండ్ లెవల్లో ‘మేనేజ్మెంట్ స్కిల్స్’ ఆ స్థాయిలో వుంటాయి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి. జనాన్ని తరలించే విషయంలో ముందస్తు ఏర్పాట్లు పక్కాగా జరుగుతాయి. అదే బహుశా ఆయన విజయరహస్యం కూడా అయి వుండొచ్చు.
ఇక, దాదాపు 25 కిలోమీటర్ల మేర వైఎస్ జగన్ మోహన్రెడ్డికి జనం రోడ్డుకి ఇరువైపులా నిలబడి ‘జయహో’ జగన్ అని నినదించారు. ఇది సాధ్యమేనా.? అని తొలుత అంతా అనుకున్నారు. కానీ, వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో విశాఖ జిల్లా వైసీపీ యంత్రాంగం, పొరుగునున్న శ్రీకాకుళం, విజయనగరంతోపాటు తూర్పుగోదావరి జిల్లా నుంచీ పెద్దయెత్తున జనాన్ని జగన్ టూర్ కోసం తరలించారు.
దాంతో, వైసీపీ వ్యూహం ఫలించింది. విశాఖని రాజధానిగా చేయడానికి వైఎస్ జగన్ సంకల్పించుకున్న విషయం విదితమే. ఈ విషయంలో విజయసాయిరెడ్డి ప్రదర్శిస్తోన్న అత్యుత్సాహం అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో ఆయన, వైఎస్ జగన్ టూర్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని అర్థం చేసుకోవాలి. ప్రతిపక్షంలో వున్నప్పుడే వైసీపీ, ప్రతిసారీ జనసంద్రాన్ని సృష్టించగలిగింది.. అలాంటిది.. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో వుంది కాబట్టి, జనసంద్రం డబుల్ అవడం పెద్ద వింతేమీ కాదు కదా.!
279152 227080I recognize there is certainly a terrific deal of spam on this weblog. Do you want support cleansing them up? I might help in between classes! 974289
419826 517675i could only wish that solar panels cost only several hundred dollars, i would really like to fill my roof with solar panels- 945154
418924 264972Spot up for this write-up, I actually believe this web website requirements a great deal more consideration. Ill likely to end up again to read a whole lot a lot more, numerous thanks for that information. 369186