సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతి మళ్ళీ తెరపైకి రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెల్సిందే. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఆమె ముఖానికి రంగు వేసుకుంది. అయితే ఈ సినిమా ఒప్పుకోవడమే భాగ్యం అన్నట్లు అప్పట్లో అనిల్ రావిపూడి మాట్లాడిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆమెను వరసగా నాలుగు రోజులు కలుసుకుని ఆ తర్వాత సినిమా కోసం ఒప్పించాడు ఈ దర్శకుడు. అంత కష్టపడి ఒప్పించి ఆమెతో సినిమా చేస్తున్నాడు కాబట్టే ఆమెకు సినిమాలో సముచిత స్థానం దక్కినట్లు తెలుస్తోంది. మహేష్ తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన పాత్ర అంటే అది విజయశాంతిదే. ఇందులో ప్రొఫెసర్ భారతి పాత్రలో ఆమె నటిస్తోంది.
ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తైన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో బిజీగా ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 5న నిర్వహించనున్న సంగతి తెల్సిందే. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా చిరంజీవి విచ్చేయనున్న విషయం ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అంటే ఈ వేడుకలో చిరంజీవి, విజయశాంతి కలవబోతున్నారన్నమాట. 90లలో చిరు, విజయశాంతిది సూపర్ హిట్ జోడి. దాదాపు 16 సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. అయితే 20 ఏళ్లుగా వీరు కలిసింది పెద్దగా లేదు. విజయశాంతి సినిమాల నుండి బ్రేక్ తీసుకున్న తర్వాత రాజకీయాలు, ఇద్దరి దారులు వేరైపోయాయి. రాజకీయంగా కూడా ప్రత్యర్ధులుగానే ఉన్నారు.
అయితే ఇప్పుడు ఇద్దరూ రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. సినిమాల్లో తిరిగి బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరిద్దరినీ కలిసి చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కనుంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ ఆడియో విజువల్ తో పాటు, చిరంజీవిపై ఒకటి, విజయశాంతిపై ఒకటి ఆడియో విజువల్ ను సిద్ధం చేయిస్తున్నారు. జనవరి 5న ఎల్బీ స్టేడియంలో ఈ వేడుక జరగనుంది.
365670 183048Spot lets start work on this write-up, I actually believe this remarkable website requirements additional consideration. Ill a lot more likely be once again you just read additional, thank you that info. 842072
239434 636969But wanna comment that you have a very good internet site , I adore the style and design it truly stands out. 432875