ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీపై అశుతోష్ మిశ్ర కమిటీ కీలక సూచనలు చేసింది. ఏటా ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంది. ఏళ్ల తరబడి పెండింగ్ ఉంచి.. ఒక్కసారే ఖాళీలను భర్తీ చేస్తే ఒకేసారి రిటైర్ మెంట్లు, పనితీరులో ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది. కార్యాలయాల పనితీరు సక్రమంగా ఉండాలంటే ఉద్యోగుల భర్తీ ముఖ్యమని దీనిని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ శాఖలన్నీ ఉద్యోగాల భర్తీ కోసం ఖచ్చితమైన సమాచారం ఉంచుకోవాలని సూచించింది.
ఏపీపీఎస్సీ లేదా జిల్లా ఎంపిక కమిటీల ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఉద్యోగాల్లో ఖాళీల వల్ల ప్రధానంగా జిల్లా, డివిజన్ స్థాయిల్లో ఉద్యోగులపై ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొంది. ప్రజలు కూడా సరైన సేవలు అందక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపింది. వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఖాళీలు ఎక్కువ ఉన్నట్టు పేర్కొంది.
196542 962916Thank you for your fantastic post! It has long been quite insightful. I hope that youll continue sharing your wisdom with us. 36665
448586 247757Hello there! I could have sworn Ive been to this weblog before but following checking by means of some with the post I realized its new to me. Anyhow, Im definitely glad I identified it and Ill be bookmarking and checking back frequently! 317530