ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ మార్చి 21, 2006లో ‘‘జస్ట్ సెట్టింగ్ అప్ మై ట్విటర్’’ అని ట్వీట్ కు ఈ మార్చి 21నాటికి పదిహేను ఏళ్లు పూర్తైంది. దీంతో ఈ ట్వీట్ ను ‘వాల్యుయబుల్స్ బై సెంట్’ వెబ్సైట్లో అమ్మకానికి పెడితే రికార్డు ధర పలికింది. లక్షల మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిన ఈ ట్వీట్ ను అత్యధికంగా 29,15,835.47 డాలర్లు (దాదాపు రూ.21 కోట్లు) పలికింది. బ్రిడ్జ్ ఒరాకిల్ సంస్థ సీఈఓ సీనా ఎస్టావీ ఇంత ధర వెచ్చించి సొంతం చేసుకున్నారు.
వీరికి ట్విటర్ సీఈవో క్రిప్టోగ్రఫీని ఉపయోగించి చేసిన డిజిటల్ ఆటోగ్రాఫ్, డిజిటల్ సర్టిఫికెట్ను పొందుతారు. ఇందులో ట్వీట్ మెటాడేటా, పోస్ట్ చేసిన సమయం తదితర వివరాలు ఉంటాయి. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని బిట్ కాయిన్ రూపంలోకి మార్చి ‘గివ్ డైరెక్ట్లీస్ ఆఫ్రికా రెస్పాన్స్’ అనే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తానని డోర్సీ ప్రకటించారు. ఈ సంస్థ ఆఫ్రికాలో కరోనా వైరస్ కారణంగా భాదపడుతున్న కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది.
657094 459831Ive exactly the same problem sometimes, but I typically just force myself via it and revise later. Good luck! 126137