ఏపీలో జీతాల కోసం ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమయ్యే పరిస్థితులు వస్తున్నాయి. జీతాల కోసం ఉద్యోగులు రోడ్డెక్కడంతో ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితులు గతంలో చూడలేదని వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సంక్రాంతి తర్వాత ప్రత్యక్ష కార్యచరణకు సిద్ధమవుతామని నేతలు హెచ్చరిస్తున్నారు.
జీతాల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలు అడగకూడదనే ప్రభుత్వం తమ జీతాల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తుందా.. అనే అనుమానం వస్తోందన్నారు. జీతాలు ఆలస్యమైనా రెండేళ్లుగా భరిస్తున్నామని.. ప్రభుత్వానికి ఇది అలవాటుగా మారిందని అన్నారు. ప్రభుత్వోద్యోగి పదవీ విరమణ చేయాలంటే భయపడే స్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు జీతభత్యాల కోసం రోడ్డు మీదకు వచ్చే పరిస్థితులు కల్పించడం దారుణమని అన్నారు. సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, జీతాల చెల్లింపు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే సంక్రాంతి తర్వాత ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
604339 20140You ought to experience a contest personally with the finest blogs on-line. Im going to suggest this page! 742865