జాతీయ రాజకీయాలపై ఇద్దరు చంద్రుల దృష్టి గట్టిగానే వుంది. ఆంధ్రప్రదేశ్ చంద్రుడికి కేంద్రంలో చక్రం తిప్పిన అనుభవం చాలానే వుంది. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్ని ఆయన చాలి గట్టిగా ప్రభావితం చేసిన విషయాన్ని ఎలా కాదనగలం? తెలంగాణ చంద్రుడూ తక్కువేమీ కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీ దిగొచ్చేలా చేయడమే కాదు, జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల మద్దతుని తెలంగాణ కోసం కూడగట్టిన ఘనుడాయన. చంద్రబాబు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ తరఫున బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తోంటే, కేసీఆర్ తీరు ఇంకోలా కనిపిస్తోంది. ఆయన ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారు.
తమిళనాడుకి ఇలా కేసీఆర్ వెళ్ళి డీఎంకే చీఫ్ స్టాలిన్తో సమావేశమయ్యారో లేదో, అలా చంద్రబాబు అదే స్టాలిన్తో ఫోన్లో మంతనాలు షురూ చేశారు. అంతే, డీఎంకే ముఖ్య నేత దొరై మురుగన్ అమరావతిలో వాలిపోయారు. చంద్రబాబు రప్పించారా.? డీఎంకే చీఫ్ స్వయంగా దొరై మురుగన్ని అమరావతికి రప్పించారా? అన్నది వేరే చర్చ. చంద్రబాబుకి జాతీయ స్థాయిలో ఇప్పుడిప్పుడే పెరుగుతున్న ఫాలోయింగ్కి దీన్ని నిదర్శనంగా టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు.
అయితే, ఎన్నికలకు ముందు ఇలాంటి చిత్ర విచిత్రాలు చాలానే చోటు చేసుకుంటాయి. పైగా, చంద్రబాబు ఇలాంటి రాజకీయాలు చేయడంలో దిట్ట. డీఎంకే చీఫ్ స్టాలిన్కీ, చంద్రబాబుకీ సన్నిహిత సంబంధాలున్నాయని తెలిసీ, ఆ బంధాన్ని తెగ్గొట్టడానికి కేసీఆర్ చెన్నయ్ వెళ్ళిన మాట వాస్తవం. అయితే, అక్కడ కేసీఆర్ పప్పులుడకలేదు కూడా. ఈ అంశంపై ఇప్పుడు టీఆర్ఎస్లో తీవ్రమైన చర్చే జరుగుతోంది.
మే 23న ఎన్నికల ఫలితాలు రానుండడంతో, ఈలోగా చంద్రబాబు ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నారు. ఫలితాలొచ్చాక ఎలాగూ ఇంకోసారి ఢిల్లీకి చంద్రబాబు వెళ్ళే అవకాశముంటుంది. ఈ జాతీయ టూర్ల కారణంగా చంద్రబాబు, ‘మహానాడు’ కార్యక్రమాన్ని కూడా ఈ ఏడాదికి పక్కన పెట్టినట్లు కన్పిస్తోంది. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో మహానాడు నిర్వహించడం కొంత కష్టం కావొచ్చు. అయితే, దాన్ని రద్దు చేయలేదు. వాయిదా దిశగా మాత్రమే ఆలోచిస్తున్నాం’ అని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి కొంత ‘కవర్’ చేసే ప్రయత్నం చేశారు.
ఇదిలా వుంటే, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ తరఫున కొన్ని టీమ్స్ని తయారు చేసి, దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఆ టీమ్లను పంపించాలనే యోచనలో వున్నారట. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసొచ్చే పార్టీల్ని కలుపుకుపోయే దిశగా ఈ టీమ్లు ఆయా పార్టీల అధినేతలతో మంతనాలు జరపనున్నాయని సమాచారమ్. ఆ టీమ్స్లో ఒకటి, తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీ అధినేతతో కూడా చర్చలు జరుపుతాయని తెలుస్తోంది.
ఇంకోపక్క, టీఆర్ఎస్ అధినేతతో చర్చలు అవసరం లేదనే భావన టీడీపీలో అంతర్గతంగా విన్పిస్తోంది. కేసీఆర్తోపాటు జగన్ కూడా బీజేపీకి అనుకూలంగానే వున్నారనీ, పైకి వారిద్దరూ ఏం చెబుతున్నా, మే 23 తర్వాత కేసీఆర్, జగన్ కలిసి ఎన్డీయేలో భాగస్వాములుగా మారతారని టీడీపీ భావిస్తోంది. ‘అది టీడీపీ భయం మాత్రమే. మేం కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం పాటిస్తున్నాం. జగన్ కూడా ఇదే భావనతో వుంటారని ఆశిస్తున్నాం’ అని టీడీపీ నేతలు అంటున్నారు.
273012 490601Very usefull blog. i will follow this weblog. keep up the excellent work. 892628
954230 6042Some genuinely good and helpful info on this internet site , besides I think the style contains amazing features. 13271
174590 769953Wow genuinely glad i came across your internet site, i??ll be confident to go to back now i??ve bookmarked it??. 678207
294917 599512You produced some decent points there. I looked on the net for any issue and found most individuals goes in addition to with all your internet site. 721584