ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అమెరికా పర్యటనలో వున్నారు.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలోని తన నివాసంలో లేరు. సరిగ్గా ఈ టైమ్లోనే ఆంధ్రపదేశ్ రాజకీయం వేడెక్కింది. వ్యవహారం లాఠీఛార్జి వరకూ వెళ్ళింది. కేవలం ఇద్దరు వ్యక్తులు ఓ డ్రోన్ కెమెరా తీసుకొచ్చి, చంద్రబాబు ఇంటి విజువల్స్ని సేకరించారు. కిరణ్ అనే ఓ వ్యక్తి తమకు అసైన్మెంట్ ఇచ్చారనీ, దాని ప్రకారం తాము విజువల్స్ సేకరించామని నిందితులు అంటున్నారు.
అదే సమయంలో, ప్రభుత్వం నుంచి తమకు అస్పైన్మెంట్ వచ్చిందంటూ మరో వాదననీ నిందితులు తెరపైకి తెచ్చారు. మరోపక్క, ఇరిగేషన్ శాఖ, కృష్ణా నది వరద అంచనా వేసేందుకు వారి సాయం తామే కోరామంటూ ప్రకటన విడుదల చేసింది. అసలేం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో.! జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత వున్న చంద్రబాబు నివాసంపై డ్రోన్ కెమెరాలు తిరగడమేంటి.? ఏదో కుట్ర జరుగుతోందని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కృష్ణా నది వరద నష్టం అంచనా వేయడానికి డ్రోన్లు కర్నూలు నుంచి కృష్ణా జిల్లా వరకూ తిరగొచ్చు. పేదల ఇళ్ళు మునిగిపోతున్నాయ్.. అధికారులు సహాయక చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారు. కానీ, ఇక్కడ ప్రభుత్వానికి ప్రతిపక్ష నేత ఇల్లు మాత్రమే టార్గెట్ అయ్యింది. ఎగువ నుంచి వచ్చే వరదను అంచనా వేయడంతో వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది. లేకపోతే, ముందుగానే శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్లు ఖాళీ చేసి వుండేవారు. ఆ తర్వాత జాగ్రత్తగా వరదను ఒడిసిపట్టుకునే అవకాశం వుండేది.
సో, అంతా పెర్ఫెక్ట్ ప్లానింగ్తో జరుగుతోందన్నమాట. ఎక్కడెక్కడ సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకునేందుకు ప్రయోగించని డ్రోన్లను చంద్రబాబు ఇంటి మీదనే ప్రయోగించారంటే.. ఎక్కడో వ్యవహారం తేడా కొడ్తోంది. ఈ విషయమై అధికార పార్టీ నేతల తడబాటు కొత్త అనుమానాలకు కారణమవుతోంది.
541941 509008Spot lets start work on this write-up, I actually believe this incredible website requirements additional consideration. Ill far more likely be once once more you just read additional, thank you that details. 650838
868702 453015You produced some decent points there. I looked on the internet for that issue and located most individuals goes along with along together with your internet site. 623220