మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పనితీరు తనకు చాలా స్ఫూర్తినిచ్చిందని నూతన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. సవాంగ్ వీడ్కోలు సందర్భంగా మంగళగిరిలోని ఆరో బెటాలియన్ మైదానంలో రాజేంద్రనాథ్రెడ్డి, గౌతమ్ సవాంగ్ గౌరవ వందనం స్వీకరించారు. రాజేంద్రనాధ్ మాట్లాడుతూ..
‘ప్రజా విశ్వాసం పోలీసులకు ఎప్పుడూ శిరోధార్యమే. పోలీసులు రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలి. పోలీసు వ్యవస్థపై ప్రజలకు అత్యున్నత స్థాయి నమ్మకం ఉంటుంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే తీవ్ర ప్రభావం ఉంటుంది. ఎవరు తప్పుచేసినా పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు వస్తుంది. తప్పుడు ఆరోపణలపై దిగులు చెందాల్సిన అవసరం లేదు. వాటిపై ఉన్నత స్థాయి విచారణ చేస్తాం.
మాజీ డీజీపీ సవాంగ్ మాట్లాడుతూ.. రెండేళ్ల 8 నెలలు కాలంలో డీజీపీగా చిన్నారులు, మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం పని చేశాను. శాంతి భద్రతల పరిరక్షణకు సవాళ్లు ఎదుర్కొన్నాను. దిశ పోలీసుస్టేషన్లు, సైబర్ మిత్ర చక్కగా పని చేస్తున్నాయి. ఏపీ మొబైల్ సేవా యాప్కు విశేష స్పందన వచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా వారిరువురూ సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమం అనంతరం.. రాష్ట్ర నూతన డీజీపీగా రాజేంద్రనాధ్ రెడ్డి మంగళగిరిలోని పోలిస్ ప్రధాన కార్యాలయంలో గౌతమ్ సవాంగ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు.
38829 826472Shame on the seek Google for no longer positioning this publish upper! Come on over and visit my website. 308081