చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అయిన సురేష్ రైనా ఐపీఎల్ ప్రస్తుత సీజన్ ఆడేందుకు ప్రాక్టీస్ చేయడంతో పాటు యూఏఈ కూడా వెళ్లడు. అక్కడ ప్రాక్టీస్ కూడా చేస్తూ అర్థాంతరంగా రైనా ఇండియా తిరిగి వచ్చేశాడు. చెన్నై జట్లు యాజమాన్యంతో ఆయన విభేదించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై ఇప్పటికే మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. చెన్నై జట్టు ఆయన్ను అధికారికంగా తొలగించేందుకు సిద్దం అయ్యింది. ఇప్పటికే అధికారిక వెబ్ సైట్ నుండి రైనా పేరును తొలగించడంతో పాటు ఆయనతో ఆర్థిక సంబంధమైన విషయాలను కూడా సెటిల్ చేసుకుంటున్నట్లగా తెలుస్తోంది.
రైనాతో ఈ ఏడాది వరకు చెన్నై జట్టుకు ఒప్పందం ఉంది. ఈ సీజన్ ఆడితే రైనాకు చెన్నై జట్లు 11 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. కాని ఆయన ఆడని కారణంగా అందులో కొంత మొత్తం కట్ చేసి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారట. వచ్చే సీజన్ లో చెన్నై జట్టుతో రైనా ఉండడు అంటూ క్లారిటీ వచ్చేసింది. ఆయన్ను మరెవ్వరు అయినా తీసుకుంటే తప్ప ఆడే అవకాశం లేదు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన కారణంగా రైనాను మళ్లీ ఏ ప్రాంచైజీ కూడా తీసుకోక పోవచ్చ అంటున్నారు. మొత్తానికి సురేష్ రైనా మెరుపులు ఇకపై క్రీడాభిమానులు చూడక పోవచ్చు
145769 656078I as nicely conceive so , perfectly indited post! . 928932