ఏపీలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటడమే ఇందుకు ఉదాహరణ. ఏపీలో కరోనా పరిస్థితుల తీవ్రతను ఈ గణాంకాలే తెలియజేస్తున్నాయి. గడచిన 24 గంటల్లో 6,051 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,02,349 కు చేరుకున్నాయి. 49 మంది మృతి చెందారు. మొత్తంగా మరణాల సంఖ్య 1,090కి చేరుకుంది.
రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు తీవ్రమవడం కలకలం రేపుతోంది. పది రోజులుగా ఏపీలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. అప్పటి వరకూ రోజుకు వెయ్యి నుంచి రెండు వేలలోపు కేసులు నమోదవగా ఇప్పుడా సంఖ్య ఏకంగా 8వేలు దాటిపోయింది. కరోనా తీవ్రతకు ఎక్కువగా ఉభయ గోదావరి రాష్ట్రాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. అత్యధికంగా తూర్పు గోదావరిలో 1210 కేసులు, గుంటూరులో 744 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 51,701 యాక్టివ్ కేసులు ఉండగా.. రికవరీ అయినవారి సంఖ్య 49, 558 గా ఉంది. 24 గంటల్లో కరోనా 43,127 పరిక్షలు నిర్వహించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తంగా ఇప్పటి వరకూ 16,86,446 కరోనా పరిక్షలు చేసినట్టు బులెటిన్ విడుదల చేసింది.
మరోవైపు దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశం మొత్తం మీద కరోనా కేసుల సంఖ్య 15 లక్షలకు చేరువలో ఉంది. మరణాలు 32వేలు దాటాయి.
60398 623169An fascinating discussion is worth comment. I feel that you really should write a lot more on this topic, it may well not be a taboo topic but typically folks are not enough to speak on such topics. Towards the next. Cheers 452851
771061 84599It is difficult to get knowledgeable folks on this topic, but the truth is be understood as what happens youre preaching about! Thanks 421728