దేశంలో కరోనా వైరస్ విజృంభణ ఏస్థాయిలో ఉందో తెలిసిందే. కరోనా విలయానికి మనుషుల ప్రాణాలతో పాటు మానవత్వపు విలువలు కూడా పోతున్నాయి. ఇందుకు సాక్షీభూతంగా నిలిచే సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం భీమవరం గ్రామంలో జరిగింది. స్థానికంగా ఉన్న బస్టాప్ వద్ద ఓ వ్యక్తి రెండు రోజుల నుంచీ అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. కరోనా వైరస్ భయంతో ఎవరూ ఆయన దగ్గరకు వెళ్లడానికి సాహసించ లేదు. రోజురోజుకీ ఆ వ్యక్తి పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
దీంతో కొందరు 108కు ఫోన్ చేశారు. అయినా.. ఆంబులెన్స్ రాలేదు. మరికొంతమంది ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా కాల్ చేశారు. అక్కడి నుంచి కూడా స్పందన శూన్యం. దీంతో కొందరు పూనుకుని ఆ వ్యక్తిని చెత్త బండిలో వేసి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 14లక్షలకు చేరుకుంది. మరణాలు కూడా 32వేలకు చేరుకున్నాయి. మరోవైపు ఏపీలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. లక్షకు చేరువలో కేసులు చేరుకోవడం కలకలం రేపుతోంది. రోజూ వేలల్లో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఈమధ్య ఉభయ గోదావరి జిల్లాలు కరోనా మహమ్మారికి బాగా ఎఫెక్ట్ అయ్యాయి.
23948 625970When I initially commented I clicked the -Notify me when new comments are added- checkbox and now each time a remark is added I get four emails with the same comment. Is there any manner you possibly can take away me from that service? Thanks! 930590