పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోదరుడు ఆశిమ్ బెనర్జీ కోల్ కతాలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. కోవిడ్ సంబంధిత సమస్యలోనే ఆయన మృతి చెందినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇటివలే ఆయన కరోనా బారిన పడ్డారు. అనంతరం ఆయన్ను కోల్ కతాలోని మెడికా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈక్రమంలో చికిత్స తీసుకుంటూ ఆయన మృతి చెందారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఈరోజు ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
పశ్చిమ బెంగాల్లో కోవిడ్ ఉధృతి ఎక్కువగా ఉంది. దేశంలోని మొత్తం నమోదవుతున్న కేసుల్లో 79.7 శాతం 12 రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. ఇందులో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో బెంగాల్లో లాక్ నిబంధనలు విధిస్తున్నట్టు సీఎం మమతా బెనర్జీ తెలిపారు. మే 16 నుంచి రెండు వారాలపాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించారు. నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 7 నుంచి 10 గంటల వరకూ అనుమతిచ్చారు.
103033 269915This constantly amazes me exactly how weblog owners for example yourself can find the time and also the commitment to keep on composing great blog posts. Your site isexcellent and 1 of my own ought to read blogs. I simply want to thank you. 435713