సీఎం కేసీఆర్ అంటే మంచిర్యాల జిల్లా దండ పాలెం కి చెందిన ఉద్యమకారుడు రవీందర్ చాలా అభిమానం. తెలంగాణ సాధనలో కేసీఆర్ చేసిన పోరాటానికి ముగ్ధుడైన రవీందర్ ఆయనకి 2016లో పాలరాతితో గుడి కట్టారు. అందులో కేసీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇంత చేసిన తనకి తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎలాంటి గుర్తింపు రాలేదని రవీందర్ మనస్తాపం చెందారు.
అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా తనకు ఎలాంటి లబ్ది చేకూరలేదంటూ బహిరంగ ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ విగ్రహంతో పాటు తెలుగు తల్లి విగ్రహం ఏర్పాటు చేయడంతో తాను ఆర్థికంగా నష్టపోయానంటూ ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు కేసీఆర్ ఆలయాన్ని అమ్మకానికి పెడుతున్నట్లు ప్రకటించారు. ఆలయాన్ని కొనదలుచుకునే వాళ్ళు ఎవరైనా తనని సంప్రదించాలంటూ తన వివరాలతో కూడిన బ్యానర్ ని సిద్ధం చేయించారు.
దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ అవుతున్నాయి.