టీడీపీ అధినేతకు అమరావతి భూముల విషయంలో ఏపీ సీఐడీ నోటీసులు ఇవ్వడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా తనదైన శైలిలో స్పందించారు. ‘మా అధినేత చంద్రబాబుకు కానిస్టేబుల్ మాత్రమే వెళ్లి ఒకే ఒక్క కాగితం (నోటీసులు) ఇచ్చాడు. కానీ మా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఎంపీ విజయసాయి రెడ్డికి నోటీసులు ఇవ్వాలంటే లారీలు కావాలి’ అని వ్యంగ్యంగా అన్నారు. తెలంగాణ సీఎల్పీ కార్యాలయానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ నేతలతో మాట్లాడారు. బయటకొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘మా సీఎం.. మా వాడు’ అంటూ జగన్ను సంభోదిస్తూనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇంకా మాట్లాడుతూ.. ‘దొనకొండ లేదా వైజాగ్ రాజధాని చేయాలని చంద్రబాబుకు మేం ఆనాడే చెప్పాం. ఒకసారి నిర్ణయం జరిగిన తర్వాత మార్చడం సరికాదని’ చంద్రబాబు ఆనాడు చెప్పారని జేసీ అన్నారు. తెలంగాణ వచ్చాక మీరు, మేము ఆగమైపోయామన్నారు. షర్మిల పార్టీ ఏర్పాటుపై మాట్లాడుతూ.. ఆమె ప్రస్తుతం వార్మ్ అప్ చేస్తోందని అన్నారు. ఏడాదిన్నరలో షర్మిల ఏపీలోకి ఎంటర్ అవుతుందని జోస్యం చెప్పారు. వైఎస్ విజయలక్ష్మికి జగన్ కంటే షర్మిల మీదనే ప్రేమ ఎక్కువన్నారు. షర్మిలకు పార్టీలో ఏదైనా కీలక పదవిస్తే సమస్య ఇంతవరకూ వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. బీజేపీ గురించి మాట్లాడుతూ.. తమ మద్దతు లేకుండా ఏపీలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని జేసీ అన్నారు.
మరోవైపు.. నోటీసులపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చంద్రబాబు నాయుడు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ఇంటివద్దకే న్యాయనిపుణులను పిలిపించుకున్న చంద్రబాబు సుమారు గంటకు పైగా ఈ విషయంపై చర్చించారు. నోటీసులపై కోర్టుకు వెళ్లే అంశాన్ని కూడా న్యాయనిపుణులు పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ కేసులో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు కూడా నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
560552 734587very good put up, i surely love this internet website, carry on it 875000
892514 233655This internet internet site is my intake , real excellent layout and perfect subject material . 998137