జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ‘మెగా’ షాక్ తగిలింది. అదీ, సొంత అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నుంచి. అదే సమయంలో, మెగాస్టార్ చిరంజీవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నెత్తిన ‘పాలు’ పోశారు. ఆంధ్రప్రదేశ్లో ‘మూడు రాజధానులు – అభివృద్ది, అధికార వికేంద్రీకరణ’ అంశం చుట్టూ రచ్చ జరుగుతోన్న విషయం విదితమే. మూడు రాజధానుల అంశాన్ని అసెంబ్లీ సాక్షిగా తెరపైకి తెచ్చిన వైఎస్ జగన్, అదే దారిలో పయనిస్తున్నారు. దాన్ని జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సరిగ్గా ఈ టైమ్లోనే మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, వైఎస్ జగన్ మోహన్రెడ్డి నిర్ణయాన్ని సమర్థించారు. దాంతో, జనసేన పార్టీకి ‘మెగా’ షాక్ తగిలినట్లయ్యింది.
నిన్ననే మెగా బ్రదర్ నాగబాబు, జనసేన ముఖ్య నేతల్లో ఒకరిగా రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించారు. రైతులకు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని ‘తుగ్లక్’ చర్యలుగా అభివర్ణించారు. అంతే కాదు, సోషల్ మీడియా వేదికగా మూడు రాజధానులా.? అంటూ నాగబాబు సెటైర్ కూడా వేశారు. మరి, ఇప్పుడు సాక్షాత్తూ ‘పెద్దన్నయ్య’ చిరంజీవే, మూడు రాజధానులకు మద్దతు పలికాక.. చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ కావొచ్చు, పెద్ద తమ్ముడు నాగబాబు కావొచ్చు… దాన్ని వ్యతిరేకించగలరా.?
నిజానికి, చిరంజీవి కేంద్ర మంత్రిగా వున్నప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. అప్పట్లోనే చిరంజీవి, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలూ అభివృద్ధి జరిగి వుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. ఆ దుస్థితి ఇంకోసారి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కి రాకూడదనే అభిప్రాయాన్ని తన తాజా ప్రెస్ నోట్లో చిరంజీవి వెల్లడించడం గమనార్హం. ఇదిలా వుంటే, మూడు రాజధానుల వ్యవహారంపై క్యాబినెట్ భేటీ వరకూ వేచి చూస్తామంటూ జనసేన ఈ రోజు ప్రకటించిన విషయం విదితమే.
607044 232321This internet web page is genuinely a walk-through for all of the information you wanted about this and didnt know who to ask. Glimpse here, and youll surely discover it. 194027
190324 645178I adore meeting utile info, this post has got me even much more info! . 846873
431693 248496Thank you for the auspicious writeup. It in reality was a amusement account it. Appear complicated to far delivered agreeable from you! Even so, how can we maintain in touch? 644500