Chiranjeevi: సినిమాల్లో సుదీర్ఘమైన ప్రస్థానంతో హాస్యబ్రహ్మగా పేరొందిన బ్రహ్మానందం తన ఆటోబయోగ్రఫీని ‘నేను’ అనే పుస్తకరూపంలో తీసుకొచ్చారు. ఈ పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కి అందించారు. బ్రహ్మానందం (Brahmanandam) ను చిరంజీవి దంపతులు పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. ఈమేరకు సోషల్ మీడియాలో చిరంజీవి పోస్ట్ చేశారు.
‘నాకు అత్యంత ఆప్తుడు.. దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులందరికీ మహాదానంద కారకుడు అయిన మనందరి బ్రహ్మానందం, తన 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో తాను కలిసిన అనేక వ్యక్తులు, పరిచయాలు, తెలుసుకున్న విషయాలు దృష్టికోణాలు, తనకెదురైన ఎన్నో ఎన్నోన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా ‘నేను’ అనే పుస్తకరూపంలో మనకందించడం ఎంతో ఆనందదాయకం’.
‘తానే చెప్పినట్టు ఒకరి అనుభవం, మరొకరికి పాఠ్యాంశం అవ్వొచ్చు. మార్గదర్శకము అవ్వొచ్చు. ఈ పుస్తకం చదివే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తదాయకం అవుతుందని, వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతూ ఈ పుస్తకాన్ని రాసిన బ్రహానందంకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ పుస్తక ప్రచురణ కర్తలయిన ‘అన్వీక్షి’కి వారిని అభినందిస్తున్నా’నని చిరంజీవి అన్నారు.
View this post on Instagram