డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో ఎల్ఓసీ వెంబడి భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. రెండు దేశాలకు చెందిన పలువురు సైనికులు ఈ ఘర్షణలో గాయపడ్డారు. ఈనేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం చెలరేగింది. ఈ సంఘటనపై చైనా స్పందించింది. ఆదేశ విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ మాట్లాడుతూ..
‘భారత్-చైనా సరిహద్దులో పరిస్థితి స్థిరంగానే ఉంది. దౌత్య, సైనిక మార్గాల్లో రెండు దేశాల మధ్య నిరంతరాయంగా చర్చలు జరుగుతున్నాయి. ఇరుపక్షాల చర్చలు సానుకూల పరిస్థితులు కల్పిస్తాయనే భావిస్తున్నా. ఇరుపక్షాలు ఏకాభిప్రాయాలకు వచ్చిన అంశాల్ని పాటించాలి. ఒప్పందాలు కఠినంగా అమలు చేయాలి’ అని అన్నారు.
ఘటనపై భారత్ స్పందించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ పార్లమెంట్ లో మాట్లాడుతూ.. సరిహద్దులో చైనా తనకు అనుకూలంగా పరిస్థితులు మలచుకునే ప్రయత్నం చేసింది. భారత సైనికులు వారి ప్రయత్నాల్ని తిప్పికొట్టారు. భారత్ సైన్యంలో ఎవరూ చనిపోలేదు. ఇరుపక్షాల సైనికులకు గాయాలయ్యాయి’ అని అన్నారు.