ఇంకో పది రోజుల్లో ఎటూ ఫలితాలు వెల్లడవుతాయ్. ఈలోగా, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చాలా హర్రీగా వర్రీ అవుతున్నట్లు కన్పిస్తోంది. పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపేందుకు చంద్రబాబు చేస్తోన్న ప్రయత్నం ఈ తరుణంలో కొంత హాస్యాస్పదంగానే మారుతోంది. ఎన్నికలకు ముందరేమో, ‘పార్టీ కోసం గట్టిగా పనిచేయాలి. చాలామంది పార్టీని లైట్ తీసుకుంటున్నారు. సీరియస్గా పనిచేయకపోతే ఎన్నికల్లో గెలవడం కష్టం’ అని పార్టీ నేతలపై చంద్రబాబు పలు సమీక్షల్లో అసహనం వ్యక్తం చేసిన సంగతి తెల్సిందే.
కానీ, ఇప్పుడు చంద్రబాబు మాటలు ఇంకోలా వుంటున్నాయి. నాలుగు విధాలుగా సమీక్షలు జరిపామనీ, అన్ని కోణాల్లోనూ తెలుగుదేశం పార్టీ విజయం ఖరారుగానే కనిపిస్తోందనీ చంద్రబాబు చెబుతున్నారు. ఆ ఫోర్ పాయింట్ ఫార్ములా ఏంటో చంద్రబాబుకే తెలియాలి. నేతల పనితీరు, ప్రభుత్వ పథకాలు, పార్టీ బలోపేతమవడం, వ్యతిరేకత తగ్గించుకోవడం.. ఇలాంటివేవో చంద్రబాబు మైండ్ సెట్లో ‘ఫార్ములాలు’గా వుంటాయనుకోండి. అది వేరే సంగతి అయినాగానీ, ఈ టైమ్లో చంద్రబాబు నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం పార్టీ వర్గాలూ హర్షించని పరిస్థితి కనిపిస్తోంది.
అవినీతి విషయంలో చంద్రబాబు అస్సలేమాత్రం సీరియస్గా వ్యవహరించలేదనీ, పార్టీకి అదో పెద్ద శతృవుగా ఈ ఎన్నికల్లో మారిందనే అభిప్రాయమొకటి టీడీపీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతూ వచ్చింది. ఆ భయమే ఇంకా టీడీపీ అభ్యర్థుల్ని వెంటాడుతోంది కూడా. సరిగ్గా ఎన్నికలకు ముందర కొందరు ముఖ్య నేతలు టీడీపీని వీడి, వైసీపీలో చేరడం కూడా టీడీపీకి పెద్ద దెబ్బగానే చెప్పాల్సి వుంటుంది. జనసేన అధినేత పవన్కళ్యాణ్ విషయంలో టీడీపీ ప్రదర్శించిన రెండు నాల్కల ధోరణి కూడా టీడీపీ విజయావకాశాల్ని దెబ్బ తీసిందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల ఫలితాలకు ముందర చంద్రబాబు అత్యంత వ్యూహాత్మకంగా పార్టీ శ్రేణుల్లో ధైర్యం నూరి పోయడానికి ఇంకో బలమైన కారణం కూడా లేకపోలేదు. అదేంటంటే, ఫలితాలు వెల్లడయిన వెంటనే జంప్ చేసేందుకు కొందరు టీడీపీ అభ్యర్థులు సిద్ధంగా వున్నారట. అలా వారెవరూ పార్టీ నుంచి జారిపోకుండా వుండడానికే చంద్రబాబు ఈ ప్రయత్నం చేస్తున్నారట. అభ్యర్థులందరినీ ఫలితాలకు రెండ్రోజుల ముందే అమరావతికి రప్పించి, క్యాంప్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే. ఇలాంటి ఐడియాలు చంద్రబాబుకి మాత్రమే వస్తాయి.
చంద్రబాబు పరిస్థితి ఇలా వుంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా ఇవే తరహా ఆలోచనలు చేస్తున్నారు. రేపు, పార్టీ ముఖ్య నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతారు. కౌంటింగ్ సందర్భంగా పార్టీ పరమైన జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలనేదానిపై చర్చించబోతున్నారు ఈ సమావేశంలో వైఎస్ జగన్. అభ్యర్థులెవరూ జారిపోకుండా వుండడానికి వీలుగా క్యాంప్ హైద్రాబాద్లోనే ఏర్పాటు చేయాలన్నది వైఎస్ జగన్ ఆలోచన అట. అయితే, పార్టీ అభ్యర్థులు మాత్రం సొంత నియోజకవర్గాల్లోనే వుండాలనీ, గెలిస్తే అక్కడే సంబరాలు చేసుకోవాలని భావిస్తున్నారట.
గెలుపోటముల సంగతెలా వున్నా, టీడీపీ – వైసీపీ తమ అభ్యర్థుల్ని కాపాడుకోవడానికి నాలుగంచెల భద్రతను ప్లాన్ చేయక తప్పేలా లేదు. రాజకీయాలు అలా ఉన్నాయ్ మరి.
708413 758708This web site is often a walk-through like the info you wanted in regards to this and didnt know who to question. Glimpse here, and youll definitely discover it. 841137
797334 907337I got what you intend,bookmarked , very decent site. 86163