2020-21కి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నుంచి రెండో విడతలో పంచాయతీలకు నిధులు విడుదలయ్యాయి. ఇప్పటికే మొదటి విడత విడుదలయ్యాయి. రెండో విడతలో మౌలిక గ్రాంట్ల కింద రూ.656 కోట్లు విడుదల చేస్తూ పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఇటివలే ఎన్నికలు పూర్తి చేసుకున్న ఏపీలోని పంచాయతీలకు నిధులు అందనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఏకగ్రీవం అయిన పంచాయతీలకు 100 కోట్లకు పైగానే నిధులు అందనున్నాయి.
ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు..5 లక్షలు, 5 వేల లోపు జనాభా ఉంటే.. 10 లక్షలు, 10 వేల లోపు జనాభా ఉంటే.. 15 లక్షలు, 10 వేల కంటే ఎక్కువ జనాభా ఉంటే.. 20 లక్షలు ఇస్తామని తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 2,197 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అత్యధికంగా కడప జిల్లాలో 258, ప్రకాశం జిల్లాలో 206, కర్నూలు జిల్లాలో 161 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.