కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా జనాలు భయాందోళనకు గురి అవుతున్నారు. ఇలాంటి సమయంలో బర్డ్ ఫ్లూ మళ్లీ వచ్చి టెన్షన్ కు గురి చేస్తోంది. మొదట రాజస్థాన్ మరియు మద్య ప్రదేశ్ లో వెలుగు చూసిన కొత్త బర్డ్ ఫ్లూ కేసులు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి.
వందల కొద్ది పక్షులు మృతి చెందుతున్న నేపథ్యంలో ఏ సమయంలో అయినా జనాలకు ఈ బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ మరియు మద్య ప్రదేశ్ లతో పాటు కేరళ మరియు హిమాచల్ ప్రదేశ్ల్లో కూడా ఈ కేసులు నమోదు అవుతున్నాయి.
వందల సంఖ్యలో కోళ్లు, బాతులతో పాటు వలస పక్షులు కూడా మృతి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నాలుగు రాష్ట్రాలకు సోకిన ఈ వ్యాది ముందు ముందు మరెంతగా విస్తరిస్తుందో అనేది అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే జాతీయ ఆరోగ్య సంస్థ మరియు ఉన్నతాధికారులు ఈ విషయమై దృష్టి పెట్టారు.
రాజస్థాన్ లో వివిద ప్రాంతాల నుండి వలస వచ్చిన 170 పక్షులు మృతి చెందినట్లుగా అధికారులు గుర్తించారు. అవి అన్ని కూడా బర్డ్ ఫ్లూ వల్లే అంటూ నిర్థారణ అయ్యింది. కేరళలో బర్డ్ ఫ్లూ నిర్థారణ అవ్వడంతో ఇతర సౌత్ ఇండియా రాష్ట్రాలకు కూడా విస్తరించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు.
795062 733512hi!,I like your writing so significantly! share we communicate a lot more about your article on AOL? I need an expert on this region to solve my dilemma. Possibly thats you! Looking forward to see you. 775238
206600 502636Merely wanna input which you have a very nice internet site , I enjoy the pattern it actually stands out. 791108