Switch to English

బిగ్ బాస్4: ఎపిసోడ్ 54-అనారోగ్యం వల్ల నోయల్‌ బయటకు, రీ ఎంట్రీ ఉంటుందా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

తెలుగు బిగ్‌ బాస్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే గంగవ్వ అనారోగ్య కారణాల వల్ల అయిదు వారాల తర్వాత ఎలిమినేషన్‌ కాకుండానే బయటకు వెళ్లిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఎనిమిదవ వారం బిగ్‌ బాస్‌ హౌస్‌ నుండి సింగర్‌ నోయల్‌ కూడా అనారోగ్య కారణాల వల్ల బయటకు వచ్చేశాడు. చాలా రోజులుగా ఆయనకు అనారోగ్య సమస్య ఉంది. హౌస్‌ లోనే వైధ్యులు అతడికి ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారు. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో తెల్లవారు జామున 3 గంటల సమయంలో నోయల్‌ ను ప్రముఖుల వద్ద ట్రీట్‌మెంట్‌ కోసం బయటకు పంపించాల్సి వస్తుంది. మీరు పూర్తి ఆరోగ్యంతో మళ్లీ హౌస్‌ లోకి వస్తారని ఆశిస్తున్నాం అంటూ బిగ్‌ బాస్‌ చెప్పి పంపించాడు.

బిగ్‌ బాస్‌ నుండి గతంలో ఇలాంటి పరిస్థితులతో వెళ్లి మళ్లీ వచ్చిన వారు ఉన్నారు. సీజన్‌ 2 లో నూతన్‌ నాయుడు వెళ్లి మళ్లీ వచ్చాడు. కనుక ఈసారి కూడా నోయల్‌ వస్తాడని అంతా భావిస్తున్నారు. కాని కరోనా పరిస్థితుల కారణంగా ఒకసారి బయటకు వెళ్లిన వ్యక్తి మళ్లీ లోనికి వెళ్లడం అనేది అత్యంత ప్రమాదంగా భావిస్తున్నారు. అయినా కూడా ఒకటి రెండు రోజులు జాగ్రత్తల మద్య ట్రీట్‌మెంట్‌ చేయించి బాగు అయితే అప్పుడు నోయల్‌ ను హౌస్‌ లోకి పంపించే అవకాశం ఉంది అంటున్నారు. విన్నింగ్‌ అవకాశాలు ఎక్కువగా ఉన్న నోయల్‌ కు ఇలాంటి పరిస్థితి కలగడం అభిమానులను కలవర పర్చతుంది.

ఇక నిన్నటి ఎపిసోడ్‌ ఇతర విషయాలకు వస్తే కెప్టెన్సీ అమ్మాయిలకు మాత్రమే అన్నట్లుగా ఈ వారం అమ్మాయిల మద్య కెప్టెన్సీ టాస్క్‌ ను నిర్వహించారు. అయితే అందుకోసం అబ్బాయిలు అమ్మాయిలకు హెల్ప్‌ చేయాలి. ఏ అమ్మాయి అయితే కెప్టెన్‌ అవ్వాలని భావిస్తున్నారో ఆ కీ ని మొదట తీసుకుని అబ్బాయిలు ఆ అమ్మాయికి ఇవ్వాల్సి ఉంటుంది. మొదట అఖిల్‌ తీసుకుని మోనాల్‌ కు ఇచ్చేశాడు. మోనాల్‌ హారికను కెప్టెన్సీ టాస్క్‌ నుండి బయటకు పంపించడంతో ముగ్గురు మాత్రమే మిగిలి పోయారు. ఆ తర్వాత అరియానకు ఛాన్స్‌ వచ్చింది. ఆ సమయంలో లాస్యను పంపించింది.

చివరకు అరియానా మరియు మోనాల్‌ ల మద్య పోటీ ఉండగా అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ కీ తీసుకుని అరియానాకు ఇచ్చాడు. దాంతో మోనాల్‌ కూడా బయటకు వెళ్లి పోయింది. చివరకు తన కోరిక నెరవేరడంతో అరియానా ఎగిరి గంతేసింది. కెప్టెన్‌ గా అరియానా మారిపోయింది. అరియానా రేషన్‌ మేనేజర్‌ గా మోనాల్‌ ను ఎంపిక చేసింది. ఈ విషయం అమ్మ రాజశేఖర్‌కు నచ్చలేదు. తాను అరియానా కోసం కష్టపడితే మోనాల్‌కు ఎందుకు ఇవ్వాలి అంటూ ఫీల్‌ అయ్యాడు. ఆ సీన్‌ డ్రామా కొద్ది సమయం జరిగింది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...