ఛ.! ఇదేం రియాల్టీ షో.? బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్లో కంటెస్టెంట్ల తీరు చూస్తే, ఒకింత జుగుప్సాకరంగానే అనిపించకమానదు. లేకపోతే, శోభా శెట్టి నోట్లో బ్రష్ పెట్టి, పళ్ళు తోమే పని టేస్టీ తేజ చెయ్యడమేంటి.? పైగా, ‘హజ్బెండ్ అనుకుని చెయ్యి..’ అంటూ శోభ ఆర్డర్ వెయ్యడమేంటి.?
మహిళా కంటెస్టెంట్లు ఏ పనీ చేయకుండా, వారికి బ్రేక్ ఫాస్ట్ చేసి పెట్టాలనీ, మహారాణుల్లా వారిని చూసుకోవాలని బిగ్ బాస్ ఆదేశించాడు. అంతే, మేల్ కంటెస్టెంట్లను బానిసల్లా చూడటం మొదలు పెట్టారు మహిళా కంటెస్టెంట్లు, శోభ అయితే, తేజని భర్తగా భావించింది.. భర్త పాత్రలో తేజని ఊహించుకుంటూ, సేవలు చేయించుకుంది.
బ్రేక్ పాస్ట్ చేసి పెట్టారు మహిళా కంటెస్టెంట్లకి మేల్ కంటెస్టెంట్లు.! ఎగబడి తినేశారు మహిళా కంటెస్టెంట్లు. రేషన్ తక్కువగా వుంది మొర్రో.. అని మేల్ కంటెస్టెంట్లే కాదు, కొందరు ఫిమేల్ కంటెస్టెంట్లూ మొత్తుకున్నా.. తిండి మాత్రం ఆగలేదు. రతిక అరటి పళ్ళు ఎక్కువగా తినేసిందని కంటెస్టెంట్లు గోల పెట్టారు.
శోభని తేజ ఎత్తుకుని మరీ, వాష్ రూమ్ దగ్గరకు తీసుకెళ్ళి పళ్ళు తోమడం చాలా చాలా చిరాగ్గా అనిపించింది. ఈ తరహా టాస్కులు గత సీజన్లలోనూ నడిచినా, అవి ఇంత ఛండాలంగా లేవు. ఈసారి అత్యంత జుగుప్సాకరం.
మహారాణులన్నాక శుభ్రంగా తయారై.. అంటే, నిజంగా మహారాణుల్లా తయారై వుంటే, వారికి మేల్ కంటెస్టెంట్లు సేవలు చేసి వుంటే, క్లాస్ టచ్తో అదిరిపోయేది. కానీ, ఇది అత్యంత దారుణంగా తయారైంది. బిగ్ బాస్ చెప్పిందేంటో కంటెస్టెంట్లకు అర్థం కావడంలేదు. పోనీ, బిగ్ బాస్ అర్థమయ్యేలా వార్నింగ్ ఇస్తున్నాడా.? అంటే, అదీ లేదాయె.
కాగా, అశ్విని – ప్రియాంక మధ్య నామినేషన్ వ్యవహారంపై డిస్కషన్ జరిగింది. ఫిజికల్గా, మెంటల్గా.. ఏ రకంగా కష్టపడినా, ఒకటే కష్టమని ప్రియాంక వాదించింది. ఈ విషయమై అశ్విని – ప్రియాంక మధ్య అస్సలు సెట్ కావడంలేదు. తన మాటల్ని ప్రియాంక అపార్థం చేసుకుంటోందంటూ శివాజీ దగ్గర వాపోయింది అశ్విని.
అశ్విని, పల్లవి ప్రశాంత్ దగ్గర ప్రియాంక విషయమై ఏడిస్తే, ఎమోషనల్గా తాను ఇబ్బంది పడుతున్నట్లు శోభా శెట్టి, తేజ వద్ద కన్నీరుమున్నీరయ్యింది. ఈ రెండూ డ్రమెటిక్ వ్యవహారాలుగానే మారిపోయాయ్.