యంగ్ హీరో నితిన్ కు ఇప్పుడొక హిట్ చాలా అవసరం. వరసగా మూడు సినిమాలు నితిన్ వి ప్లాపై ఉన్నాయి. కాబట్టి వచ్చే సినిమాతో హిట్ కొట్టి తాను రేసులో వెనకపడలేదని నిరూపించుకోవాలి. అందుకు సరైన సినిమాగా భీష్మను అనుకుంటున్నాడు నితిన్. ఛలో సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన వెంకీ కుడుముల భీష్మ సినిమాను తెరకెక్కిస్తుండగా, ఛలోతో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది.
భీష్మను ఒక ఎంటర్టైనింగ్ రొమాంటిక్ కామెడీగా తీర్చిదిద్దుతున్నాడు దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మెజారిటీ భాగం పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి ఫిబ్రవరి 21న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు నిర్మాతలు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం కొద్ది సేపటి క్రితం ఈ సినిమాలోని మొదటి పాట సింగిల్స్ యాంథం పేరుతో విడుదలైంది. శ్రీమణి లిరిక్స్ అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి బాణీలు సమకూరుస్తుండగా ఈ పాటను చాలా క్యాచీగా స్వరపర్చాడు.
సింగిల్స్ అబ్బాయిల కష్టాలను చాలా ఫన్నీ వే లో వివరించాడు లిరిసిస్ట్ శ్రీమణి. అలాగే ఈ సినిమాలో నితిన్ పాత్ర చిత్రణ ఏ విధంగా ఉండబోతోందో కూడా వివరించాడు. చూస్తుంటే ఈ పాట చాలా తక్కువ సమయంలోనే చార్ట్ బస్టర్ అయ్యేలా ఉంది. జనవరి నుండి ఈ చిత్ర ప్రమోషన్స్ మరింత ఊపందుకోబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతున్నారు.
289278 288621hey there, your site is amazing. I do thank you for function 115694