తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం పట్టణంలో ఒకటో డివిజన్ కార్పొరేటర్ కు స్థానికులకు మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఓ యువకుడి మృతికి కార్పొరేటర్ కారణమనే ఆరోపణలే ఇందుకు వేదికైంది. దీంతో కార్పొరేటర్ పై దాడి చేసి ఖరీదైన అతని ఫార్చూన్ కారుని పెట్రోలు పోసి తగులబెట్టారు. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తలకు దారి తీసాయి. వివరాల్లోకి వెళ్తే..
స్థానిక కైకొండాయిగూడెంకు చెందిన తేజావత్ ఆనంద్ తేజ గత నెల 16న డివిజన్ కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్ ఇంట్లో పనికి వెళ్లాడు. అయితే.. పనిలో ఉండగానే ఆనంద్ తేజ్ మృతి చెందాడు. యువకుడి మృతికి కార్పొరేటరే కారణమని.. గుప్త నిధుల తవ్వకాలకు తమ కుమారుడ్ని బలి ఇచ్చారంటూ ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఈ కేసులో యువకుడి బంధువులతో కార్పొరేటర్ బేరసారాలు సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే కైకొండాయిగూడెంకు కార్పొరేటర్ రాగానే యువకుడి బంధువులు, కుటుంబ సభ్యులు కార్పొరేటర్పై దాడికి పాల్పడ్డారు.
దీంతో బెదిరిపోయిన ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్లి దాక్కున్నాడు కొర్పొరేటర్. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు ఆయన్ను రక్షించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఉద్రిక్తల మథ్యే కార్పొరేటర్ ను పోలీసులు తమ వాహనంలో తీసుకెళ్లారు. ఆ వెంటనే కార్పొరేటర్ ఫార్చూన్ కారును అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. కోపోద్రిక్తులైన స్థానికులు ఆ కారుపై పెట్రోలు పోసి నిప్పంటించారు. దీంతో కారు పూర్తిగా దగ్దమైంది.
839217 378452Hello there, I discovered your weblog by way of Google at exactly the same time as searching for a comparable subject, your website got here up, it seems to be excellent. Ive bookmarked it in my google bookmarks. 187714
218228 999801Spot on with this write-up, I truly suppose this web site needs much a lot more consideration. probably be once much more to learn way more, thanks for that info. 600381
945081 675657Perfectly written topic material , thanks for selective info . 921327