నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ నల్లగొండ నియోజక వర్గంలో ప్రగతి సమీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో పలు విషయాలపై ఆయన స్పందించారు. హాలియాలో జరిగిన బహిరంగ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ నాగార్జున్ సాగర్ కు 15 ఎత్తి పోతల పథకాలను మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఏడాదిన్నర కాలంలోనే ఈ నియోజక వర్గంలో అన్ని ఎత్తి పోతల పథకాలను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కృష్ణ జలాల విషయంలో గత కొన్నాళ్లుగా జరుగుతున్న వివాదంపై కూడా కేసీఆర్ స్పందించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్నట్లుగా కేసీఆర్ పేర్కొన్నాడు. కృష్ణా జలాల విషయంలో ఏపీ ప్రభుత్వం దాదా గిరి చేస్తుందని.. తెలంగాణ కు రావాల్సిన నీటి విషయంలో ఎందుకు అడ్డు తలుగుతున్నారు అంటూ ఆరోపించాడు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో తెరాసా ను గెలిపించినందుకు గాను కృతజ్ఞతలు అంటూ కేసీఆర్ తెలియజేశారు. ఎన్నికల ప్రచారం సమయంలో ఇచ్చిన హామీ మేరకు తాను అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా కూడా పేర్కొన్నాడు.
79732 726468Just wanna comment that you have a extremely good internet web site , I really like the design it really stands out. 324439