Switch to English

ముఖ్యమంత్రితో పోరాడుతున్న రఘురామ.. అంత వీజీ కాదుగానీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

2019 ఎన్నికల్లో తనకు నర్సాపురం లోక్ సభ టిక్కెట్ ఇచ్చిన, తన గెలుపుకు కారణమైన.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్ట అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద పోరాటం చేస్తున్నారు రఘురామకృష్ణరాజు. ఆషామాషీ వ్యవహారం కాదిది. ప్రస్తుతం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి స్థానంలో వున్నారు. బోల్డంత పవర్ జగన్ సొంతం ఇప్పుడు. ముఖ్యమంత్రిని ఓ ఎంపీ ఢీ కొట్టడం అంటే ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమయ్యే పని కాదు.

ఇంగ్లీషు మాధ్యమం విషయంలోనూ, అమరావతి విషయంలోనూ, రాష్ట్రంలో దేవాలయాల మీద జరిగిన దాడుల విషయంలోనూ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలపై రఘురామ, సొంత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన మీద రాజద్రోహం కింద కేసులు నమోదవడం, ఆయన్ని ఏపీ సీఐడీ అరెస్ట్ చేయడం తెలిసిన విషయాలే.

ఇప్పటిదాకా ఓ యెత్తు.. ఇకపై ఇంకో యెత్తు. రఘురామ ప్రస్తుతం పోరాటాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్ళారు. ‘ఆర్టికల్ 124 ఎ’ని రద్దు చేయాలన్నది రఘురామ డిమాండ్. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు (ఒక్క ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తప్ప) ఈ విషయమై లేఖలు రాస్తున్న రఘురామ, ఆయా రాష్ట్రాల్లోని అసెంబ్లీల్లో ఈ సెక్షన్ రద్దుపై తీర్మానం చేయాలని కోరుతున్నారు.

మరోపక్క, తన మీద ఏపీ సీఐడీ అత్యంత హేయంగా థర్డ్ డిగ్రీ టార్చర్ ప్రయోగించిందని ఆరోపిస్తున్న రఘురామ, ఆ అంశాన్ని కూడా జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేయగలిగారు. రఘురామ మీద వైసీపీ ప్రభుత్వం అక్కసు.. అనేది వేరే చర్చ. ‘సెక్షన్ 124 ఎ’ ఎత్తివేయడం అన్నది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. గతంలో పలు న్యాయస్థానాలు ఈ సెక్షన్ విషయమై కీలక వ్యాఖ్యలు చేసినా, పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాస్వామ్యవాదులు గళమెత్తినా.. ఆ తర్వాత అవన్నీ సద్దుమణిగిపోయాయి.

కానీ, ఈ మధ్యకాలంలో చాలా విరివిగా ప్రభుత్వాలు రాజద్రోహం కింద కేసులు నమోదు చేసేస్తున్న దరిమిలా, ఈ అంశం అత్యంత కీలకమైన చర్చనీయాంశంగా మారుతోంది. రేప్పొద్దున్న పార్లమెంటులో ఇదే అంశం చర్చనీయాంశమైతే, తన మీద ఏపీ ప్రభుత్వం దాడి చేసిందంటూ తన వాదనను రఘురామ సమర్థవంతంగా వినిపించేందుకు ఆస్కారమేర్పడుతుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...