కేరళ రాష్ట్రం పలక్కాడ్ లోని సైలెంట్ వ్యాలీలో ఏనుగును చంపేసిన ఘటన గురించి తెలిసిందే. ఈ దారుణం జరిగి రెండు రోజులైనా కాకముందే మరో అనుమానిత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇది కూడా మరో ఏనుగు కథే. జరిగింది కేరళలోనే. కొల్లం జిల్లా పతానపురం అటవీప్రాంతంలో రెండు నెలల క్రితం జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి అటవీ అధికారులు ఇప్పుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..
‘ఏప్రిల్ లో బలహీనంగా ఉన్న ఓ ఆడ ఏనుగు కనిపించింది. దానికి వైద్యం చేయాలని భావించగా అది అరుచుకుంటూ తప్పించుకుని వెళ్లిపోయింది. మరుసటి రోజున ఓ ప్రాంతంలో అదే ఏనుగు మరణించి కనిపించింది. పోస్ట్ మార్టం రిపోర్టులో ఆ ఏనుగు దవడ విరిగినట్టు తేలింది. ప్రస్తుతం జరగిన ఉదంతాన్ని బట్టి ఆ ఏనుగు కూడా ఇలానే ఏదైనా పేలుడు పదార్ధం తినడం వల్లే మృతి చెందిందనే అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం వైద్య పరిక్షల దశలో ఉన్న రిపోర్టులు రావాల్సి ఉంది’ అని చెప్తున్నారు.
మరోవైపు కేరళ రాష్ట్రంలో ఏనుగుకు పైన్ ఆపిల్ పెట్టి చంపేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ దారుణ ఉదంతం భారతీయులందరికీ మనోవేదనతో పాటు ఆగ్రహావేశాలు రగిలిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగి నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించింది.
134498 905419 There are some interesting points in time in this article but I dont know if I see all of them center to heart. There is some validity but I will take hold opinion until I look into it further. Excellent write-up , thanks and we want much more! Added to FeedBurner as properly 543843