డిజిటల్ ప్లేట్ ఫార్మ్స్ వచ్చాక తెలుగు సినిమాలకి ఈ మధ్య కాస్త లాభాలు పెరిగాయి. ఎందుకంటే వాళ్ళు సినిమా రేంజ్ ని బట్టి శాటిలైట్ రైట్స్ కంటే ముందే డిజిటల్ రైట్స్ కొనుక్కుంటున్నారు. మొదట్లో బాగుందని నిర్మాతలు పొలోమని అమ్మేయడం మొదలు పెట్టారు. కానీ ఆ తొందరపాటు ఇప్పుడు వాళ్ళ కొంపముంచుతోంది. మొదట 30 రోజులకే ఆన్ లైన్లో పెట్టేస్తుండడంతో సమస్య మొదలైంది.
కొన్ని సార్లు సినిమా విజయం సాధించి ఇంకా థియేటర్స్ లో ఆడుతుండగానే ఆ సినిమా ఆన్ లైన్ లో వచ్చేయడం, దానివల్ల పైరసీ వచ్చేసి థియేటర్స్ కి జనాన్ని రానివ్వడం లేదు. దీనితో డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతున్నామని నిర్మాతలకి తెలియజేశారు. అంతే కాకుండా శాటిలైట్ రైట్స్ కి ఇబ్బంది వస్తోంది. టీవీలో రాకముందే ఇలా ఆన్ లైన్ లో రావడం వల్ల శాటిలైట్ మార్కెట్ కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. వీటన్నిటినీ దృష్టిలోపెట్టుకుని అల్లు అర్జున్ తో ‘అలా వైకుంఠపురములో’ నిర్మిస్తున్న నిర్మాతలు చినబాబు – అల్లు అరవింద్ లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
‘అలా వైకుంఠపురములో’ సినిమాని 8 వారాల తర్వాతే ఆన్ లైన్ సైట్స్ ప్రసారం అయ్యేలా కండిషన్స్ పెడుతున్నారు. ఇప్పటికే ఈ కండిషన్ ని పెద్ద బడ్జెట్ సినిమాలైనా సాహో, సైరా లాంటి సినిమాలకి పెట్టారు. కానీ ఇక నుంచి ప్రతి సినిమాకి ఇదే కండిషన్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయంలో ‘అలా వైకుంఠపురములో’ టీం మొదటి స్టెప్ వేసి ఆన్ లైన్ స్ట్రీమింగ్ కంపెనీస్ కి కండిషన్ పెడుతోంది. డిస్ట్రిబ్యూటర్స్ విషయంలో నిర్మాతలు తీసుకుంటున్న ఈ నిర్ణయం అభినందనీయం అని చెప్పాలి.
22535 544510This internet website is often a walk-through for all of the understanding you wanted concerning this and didnt know who should. Glimpse here, and youll totally discover it. 770987