Adipurush: ప్రభాస్ (Prabhas) నటించిన ఆదిపురుష్ సినిమా విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న చిత్ర రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా (manoj muntashir shukla) ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఇన్ స్టా వేదికగా ఆయన పోస్టు చేశారు. ‘ఆదిపురుష్ (Adipurush) వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన అంగీకరిస్తున్నాను. ప్రజలకు చేతులు జోడించి క్షమాపణలు చెప్తున్నా. హనుమంతుడు మనల్ని ఐక్యంగా ఉంచాలని.. దేశానికి సేవ చేసే ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్ననన’ని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అయింది.
సినిమాలో హనుమంతుడి డైలాగ్స్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అసలు ఇది రామాయణం కాదు.. ఇన్ స్పిరేషన్ అని రచయిత చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. రావణాసురుడు, ఇంద్రజిత్తు లుక్స్ పై కూడా విమర్శలు వచ్చాయి. మరోవైపు అలహాబాద్ హైకోర్టు జూలై 27న కోర్టులో హాజరు కావాలని దర్శకుడు ఓమ్ రౌత్, రచయిత మనోజ్, నిర్మాత భూషణ్ కుమార్ లను ఆదేశించింది. ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయా లేదా అనే అంశంపై ఐదుగురితో కమిటీ వేయాలని కేంద్రానికి సూచించింది.