Switch to English

రోజుకి 20 వేల పైన కేసులు: ఏపీలో సిట్యుయేషన్ అండర్ కంట్రోల్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ పెద్దలు ఏం సంకేతాలు పంపుతున్నట్టు.? రోజుకి 20 వేలకు పైబడిన సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో నమోదవుతోంటే, ‘సిట్యుయేషన్ అండర్ కంట్రోల్..’ అన్నట్టుగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? ఇతర రాష్ట్రాలతో పోల్చితే, కరోనాపై పోరులో ఏపీ ముందంజలో వుందని సెలవిచ్చారు సజ్జల. అంటే, మహారాష్ట్రతోనూ, కర్నాటకతోనూ ఆంధ్రపదేశ్ రాష్ట్రాన్ని సజ్జల పోల్చదలచుకున్నారా.? ఆయన ఉద్దేశ్యం. సిట్యుయేషన్ అండర్ కంట్రోల్.. అని చెప్పడమేనా.?

పరిస్థితి చెయ్యిదాటిపోవడంతో, 18 గంటల కర్ఫ్యూ విధించింది ఆంధ్రపదేశ్ ప్రభుత్వం. ఇది రాష్ట్రంలో కరోనా తీవ్రతను చెప్పకనే చెబుతోంది. ఒక్క రోజులో 84 మంది కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతే, ‘సిట్యుయేషన్ అండర్ కంట్రోల్’ అని ప్రభుత్వ పెద్దలు ఎలా ప్రకటించగలుగుతారు.? ఇదిగో, ఇలాంటి ప్రకటన వల్లనే, ఆంధ్రపదేశ్ ప్రజల్లో కొంత అలసత్వం చోటు చేసుకుంది. అదే ఇప్పుడు రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఇంతలా విరుచుకుపడటానికి కారణమయ్యింది.

కరోనా సెకెండ్ వేవ్ తీవ్రతను ముందే అంచనా వేయగలిగిన తెలంగాణ ప్రభుత్వం, అత్యంత చాకచక్యంగా తొలుత విద్యా సంస్థల్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూ విధించడంలో అయినా, కరోనా పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంలో అయినా, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడంలో అయినా, తెలంగాణ ప్రభుత్వం అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించింది. అందుకే, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం అదుపులో వుంది.

ఒకానొక దశలో రోజువారీ కేసులు 10 వేలు దాటినా, ఆ తర్వాత క్రమగా కేసుల తీవ్రత తగ్గింది. పైగా, కరోనా అత్యంత తీవ్రంగా వున్న మహారాష్ట్రతో తెలంగాణ, సరిహద్దుని పంచుకుంటోంది. అయినాగానీ, తెలంగాణలో పరిస్థితి అదుపులోనే వుండడం గమనించాల్సిన విషయం. తెలంగాణలోనూ కరోనా వైద్య చికిత్స విషయమై సమస్యలున్నాయి. ఇక్కడా కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య గణనీయంగానే వుంది.

కానీ, ఆంధ్రపదేశ్ స్థాయిలో కాదు. తెలంగాణ నుంచి ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి వెళ్ళి వైద్య చికిత్స తీసుకుంటున్నవారి సంఖ్య చాలా చాలా తక్కువ. అదే ఆంధ్రపదేశ్ నుంచి తెలంగాణకు వైద్య చికిత్స నిమిత్తం వస్తున్నవారి సంఖ్య చాలా చాలా ఎక్కువ. ఏపీ నుంచి అధికార పార్టీ నేతలు కరోనా సోకగానే, తెలంగాణకు పరుగులు పెడుతున్నారు. ఇదీ ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ‘సిట్యుయేషన్ అండర్ కంట్రోల్’ వైనం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...