Switch to English

ఉప ఎన్నిక వస్తే, గంటా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. గంటా తొలుత స్పీకర్ ఫార్మాట్‌లో కాకుండా నిరసన రూపంలో రాజీనామా చేశారు. రెండోసారి మాత్రం స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా చేశారు. అయితే, గంటా రాజీనామాని స్పీకర్ తమ్మనేని సీతారాం ఆమోదించాల్సి వుంది.

గంటా రాజీనామాకి ఆమోదం లభిస్తుందా.? లేదా.? అన్న సంగతి పక్కన పెడితే, ఉప ఎన్నిక వస్తే గంటా శ్రీనివాసరావు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు.? అన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ నేపథ్యంలో తలెత్తిన ఉద్యమాన్ని పొలిటికల్‌గా క్యాష్ చేసుకునేందుకు, తద్వారా తన పొలిటికల్ ఇమేజ్ పెంచుకునేందుకు గంటా శ్రీనివారావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారన్నది నిర్వవాదాంశం.

అయితే, ఈ వాదనను ఆయన కొట్టి పారేస్తున్నారు. విశాఖ వాసిగా, స్టీలు ప్లాంటు సెంటిమెంట్ తనకు బాగా తెలుసనీ, బాధ్యత గల పౌరుడిగా మాత్రమే తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనీ అంటున్నారు. మరోపక్క, గంటా శ్రీనివారావు వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పటికే వైసీపీ అధిష్టానంతో ఆయన టచ్‌లోకి వెళ్ళారనీ, అయితే మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆయనకు అడ్డుపుల్ల వేస్తున్నారనీ గుసగుసలు వినిపిస్తున్నాయి.

నిజానికి, చాలాకాలంగా ఇటు గంటా ప్రయత్నాలు, అటు అవంతి అడ్డుపుల్లలు అనే ఎపిసోడ్ నడుస్తూనే వుంది. బీజేపీ ఎటూ, గంటా శ్రీనివాసరావుని తమవైపుకు రానివ్వదు. జనసేన సంగతి సరే సరి. తెలుగుదేశం పార్టీలో గంటా కొనసాగలేని పరిస్థితి. ఇంతటి గందరగోళ పరిస్థితుల్లో గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖతో రాజకీయ వ్యూహాన్ని పక్కగా తెరపైకి తెచ్చారుగానీ, అది ఆయన్ని మరింతగా అయోమయంలో పడేసిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా కనిపిస్తోంది.

‘మీ రాజీనామాతో, మీ పోరాటంతో విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ ఆగుతుందా.?’ అని ప్రశ్నిస్తే, ‘ఆగాలనే కోరుకుంటున్నాను.. అందరూ కలిసొస్తే తప్ప అది సాధ్యం కాదు..’ అని గంటా అసలు విషయాన్ని తేల్చేశారు. ఉద్యమానికి నాయకత్వం వహించడానికి కూడా ఆయన మొహమాటపడుతుండడం ఆయన ‘ఊగిసలాట రాజకీయాన్ని’ చెప్పకనే చెబుతోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...