ఏపీలో పంచాయితీ ఎన్నికలు ఇప్పటికే రెండు దశలు పూర్తి అయ్యాయి. మూడవ దశకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సమయంలోనే ఏపీ మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం మరియు ఎస్ఈసీ సిద్దం అయ్యింది. గత ఏడాది మార్చిలోనే ఎన్నికలు జరుగాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా నిలిపి వేయడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల పక్రియ ఎక్కడ నిలిచిందో అక్కడ నుండి పునః ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చారు. ఈ విషయంపై ఎస్ఈసీ కూడా అనుకూలంగా ఉండటంతో పాటు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
మార్చి 10వ తారీకున పురపాలిక ఎన్నికలు జరుపబోతున్నట్లుగా ఎన్నికల కమీషన్ ప్రకటించింది. మార్చి 3వ తారీకు మద్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ ల గడువు పెట్టారు. మొత్తం 12 మున్సిపల్ కార్పోరేషన్ లకు మరియు 75 మున్సిపల్ మరియు నగర పంచాయితీలకు ఎన్నికలు జరుపబోతున్నారు. గతంలో నామినేషన్ ల ఉపసంహరణ దశలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు అక్కడి నుండే ఎన్నికల పక్రియ ప్రారంభించబోతున్నారు. కొత్త వారు నామినేషన్ వేసే అవకాశంను ఎస్ఈసీ ఇవ్వలేదు. వాయిదా పడ్డ వద్ద నుండి పునః ప్రారంభించడం ను కొందరు జీర్ణించుకోవడం లేదు.
724523 966113Just wanna remark that you have a extremely nice web web site , I like the layout it really stands out. 556002