Switch to English

మోడీ హైద్రాబాద్‌ టూర్‌: ‘గ్రేటర్‌’ వ్యాక్సిన్‌ కోసమేనా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ప్రధాని నరేంద్ర మోడీ హైద్రాబాద్‌కి వస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం అందింది. తగిన భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాని రాక కోసం చేయాల్సి వుంటుంది. ఇంతకీ, ప్రధాని మోడీ హైద్రాబాద్‌కి ఎందుకు వస్తున్నట్లు.? గ్రేటర్‌ ఎన్నికల వేళ, కరోనా వ్యాక్సిన్‌ విషయమై ప్రధాని హైద్రాబాద్‌ వస్తున్నారంటే.. కొన్ని అనుమానాలు కలగడం సహజమే.

గ్రేటర్‌ ఎన్నికల్ని బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జాతీయ స్థాయి నేతలంతా గ్రేటర్‌లో మోహరించేశారు. దాంతో, గ్రేటర్‌ ఎన్నికల రాజకీయం అనూహ్యంగా హీటెక్కింది. గతంలో ఎన్నడూ ఏ కార్పొరేషన్‌ ఎన్నికలూ ఇంత వేడిగా జరిగిన దాఖలాల్లేవు. మతాల ప్రస్తావన వస్తోంది.. ఇండియా – పాకిస్తాన్‌ క్రికెట్‌ గొడవలు చర్చకు వస్తున్నాయి.. సర్జికల్‌ స్ట్రైక్స్‌ అంశమే కాదు, రోహింగ్యాల వ్యవహారాలూ హాట్‌ టాపిక్స్‌గా మారుతున్నాయి. ఇలాంటి తరుణంలో, కేవలం వ్యాక్సిన్‌ వ్యవహారాల గురించే ప్రధాని మోడీ హైద్రాబాద్‌కి వస్తున్నారంటే నమ్మేదెలా.?

పైగా, ఈ టూర్‌ ఆకస్మికంగా ఖరారయ్యిందట. ప్రధాని టూర్‌ సందర్భంగా బీజేపీ నేతల హంగామా ఓ రేంజ్‌లో వుంటుందన్నది నిర్వివాదాంశం. అయితే, ప్రస్తుతానికి ప్రధాని టూర్‌లో రాజకీయ వ్యవహారాలకు తావుండదనే ప్రచారం జరుగుతోంది. కానీ, ప్రధాని వ్యాక్సిన్‌ వ్యవహారాలపై మాట్లాడుతూ, తనదైన స్టయిల్లో రాజకీయ వ్యాఖ్యలు చేస్తే మాత్రం, గ్రేటర్‌ ఎన్నికల హీట్‌ మరింత పెరుగుతుంది.

అంతా బాగానే వుందిగానీ, గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా వున్నాయా.? లేదా.? లేకపోతే మాత్రం, బీజేపీ కష్టం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ‘ప్రధాని వస్తున్నారంటే, పరిస్థితి బీజేపీకి అనుకూలంగా వున్నట్లే..’ అని బీజేపీ నేతలు కొందరు ఆఫ్‌ ది రికార్డ్‌గా వ్యాఖ్యానిస్తున్నారట. మేయర్‌ పదవి విషయమై ఇంత రాజకీయం అవసరమా.? అంటే, రాజకీయాల్లో అన్నీ అవసరమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

కరోనా వ్యాక్సిన్‌ త్వరలో అందుబాటులోకి రానుందన్న అంచనాల నడుమ, వ్యాక్సిన్‌ని దేశ ప్రజలందరికీ అందించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ నేపథ్యంలోనే ప్రధాని ప్రత్యేక చొరవ చూపి, ఆయా వ్యవహారాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, అవసరమైన మేర చర్యలు చేపడుతున్నారు. అన్నట్టు, ‘ఉచిత కరోనా వ్యాక్సిన్‌’ హామీని కూడా గ్రేటర్‌ ప్రజలకు బీజేపీ ఇచ్చేసిన విషయం విదితమే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...