Switch to English

టిబి స్పెషల్: ఔను, జనసేన పార్టీ బలోపేతమవుతోంది.. ఇదీ వాస్తవం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

కొన్ని సర్వేలు తప్పుడు నివేదికల్ని ప్రచారంలోకి తీసుకురావొచ్చు.. జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో అస్సలేమాత్రం ప్రభావం చూపలేదని కొందరు రాజకీయ విశ్లేషకులు ఎద్దేవా చేయొచ్చు. కానీ, 2019 ఎన్నికల తర్వాత ఈక్వేషన్స్‌ మారిపోయాయి. ‘ఏవి పాలు, ఏవి నీళ్ళు..’, ‘ఏది చెడు, ఏది మంచి’ అన్న విషయాలపై రాష్ట్ర ప్రజానీకానికి ఓ అవగాహన వచ్చింది.

వైసీపీ – టీడీపీ మధ్య ఆధిపత్య పోరు తప్ప, రెండు పార్టీలకీ రాష్ట్ర అభివృద్ధిపై అస్సలేమాత్రం అవగాహన, విజ్ఞత, బాధ్యత లేవని తేలిపోయింది. ‘మేం ఎన్నికల్లో ప్రజల్ని ప్రలోభపెట్టబోం.. ఎన్ని సీట్లు వస్తాయి.? గెలుస్తామా.? ఓడతామా.? అన్నదే ప్రశ్నే కాదు. మేం, ఎంతమందిని ప్రబావితం చేయగలిగామన్నదే మాకు ముఖ్యం..’ అని చెప్పిన జనసేన మాటల్లో అసలు వాస్తవమేంటో, ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది.

బాధ్యతగల రాజకీయ పార్టీగా జనసేన పార్టీ, గడచిన ఏడాది కాలంలో చాలా విషయాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చింది.. ప్రజల తరఫున పోరాడుతోంది. ‘ఫక్తు రాజకీయాలకు’ దూరంగా జనసేన రాజకీయాలు నడుస్తుండడంతో, బహుశా రాజకీయ విశ్లేషకులకు కూడా జనసేన అనేది ఓ రాజకీయ పార్టీగా కనిపించి వుండకపోవచ్చు.

‘తెలుగు బులెటిన్‌ డాట్‌ కాం’ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. జనసేన పార్టీని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఎలా నడిపిస్తున్నారు.? ఎలా బలోపేతం చేస్తున్నారు.? తదుపరి ఎన్నికల్లో జనసేన పాట్ర ఏంటి.? అన్న దిశగా ఓ ఒపీనియన్‌ పోల్‌ని ప్రారంభించింది. ‘పవన్‌ కళ్యాణ్‌, జనసేన పార్టీని బలోపేతం చేసి తదుపరి ఎన్నికల్లో ముఖ్య పాత్ర వహించే దిశగా నడుస్తున్నారని మీరు భావిస్తున్నారా.?’ అని అడిగిన ప్రశ్నకు ‘అవును’ అనే సమాధానం 74 శాతం మంది నుంచి వచ్చింది. ‘కాదు’ అన్నవారు 26 శాతం మంది.

అయితే, జనసేన పార్టీ, జనంలోకి వెళ్ళేందుకు ఇంకా చాలా కష్టపడాల్సి వుందన్నది నిర్వివాదాంశం. బీజేపీతో జనసేన మైత్రి విషయంలో కొంత గందరగోళం గ్రౌండ్‌ లెవల్‌లో కనిపిస్తోంది. చాలా అంశాల్లో బీజేపీ, జనసేన పార్టీతో కలిసి నడవడంలేదు. కీలకమైన విషయాల్లో జనసేన వాయిస్‌తో బీజేపీ గొంతు కలపలేకపోతోంది. ఆ కారణంగా బీజేపీ పట్ల వున్న నెగెటివిటీ, జనసేన వైపుకూ మళ్ళుతోంది.

ఇంకోపక్క, టీడీపీ – జనసేన కుమ్మక్కు.. అంటూ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం, ‘జనసేన పార్టీ మాకు మిత్రపక్షం లాంటిదే..’ అంటూ టీడీపీ నేతలు కొందరు గ్రౌండ్‌ లెవల్‌లో చేస్తున్న దుష్ప్రచారాల పట్ల జనసేన పార్టీ అప్రమత్తంగా వుండాల్సిందే. అన్నిటికీ మించి, వివిధ అంశాలపై జనసేన తరఫున బలమైన గొంతుకల అవసరం ఎంతైనా వుంది.

ఎన్నికలకు ఇంకా చాలా సమయం వుందని లైట్‌ తీసుకుంటే కుదరదు. రాజకీయాల్లో ఈక్వేషన్స్‌ ఏ క్షణాన ఎలాగైనా మారిపోవచ్చు. మరి, జనసేనాని ఆ దిశగా మరింత వేగం పెంచుతారా.? రాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తోన్న ‘పొలిటికల్‌ వాక్యూం’ జనసేన పార్టీ భర్తీ చేస్తుందా.? వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...