బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పూత్ మృతి విషయమై పలు అనుమానాలు ఉన్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లుగా అక్కడ పరిస్థితి ఉన్నా కూడా అది బలవంతపు మృతి అయ్యి ఉంటుందని లేదంటే ఎవరైనా చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారేమో అంటూ అభిమానులు మరియు ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర పోలీసులు మాత్రం సుశాంత్ మృతిని ఆత్మహత్యగా దాదాపుగా నిర్థారించారు. ఈ కేసు విషయంలో వారు అలసత్వంతో వ్యవహరిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బీహార్ పోలీసులు పలు ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకు వచ్చి సుశాంత్ మరణంపై మరిన్ని అనుమానాలు కలిగేలా చేశారు.
ముంబయిలో కేసు విచారణ చేపట్టాల్సి ఉండగా పాట్నా పోలీసులకు మద్దతు దక్కడం లేదు అనే ఆరోపణలు వినిపించాయి. మహారాష్ట్ర మరియు బీహార్ రాష్ట్రాల మద్య వివాదంగా ఇది మారింది. పాట్నా మరియు ముంబయి పోలీసుల మద్య వాగ్వివాదం నుండి మొదలుకుని బీహార్ ఐపీఎస్ను క్వారెంటైన్ చేయడం వరకు ఎన్నో తప్పుల మీద తప్పులను ముంబయి పోలీసులు చెశారు. దాంతో సుశాంత్ కేసులో ఎవరినో కాపాడేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ సమయంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ కేంద్ర హోం శాఖకు సిఫార్సు చేయడం జరిగింది. దాంతో కేసు ఇప్పుడు సీబీఐకి అప్పగించేందుకు కేంద్రం సిద్దం అయ్యింది. ఈ విషయాన్ని హోం శాఖ కార్యదర్శి తుషార్ మెహతా పేర్కొన్నారు. సీబీఐ కి ఈ కేసు అప్పగించడంతో మహారాష్ట్ర మరియు బీహార్ పోలీసుల ప్రమేయం ఇందులో ఉండే అవకాశం ఉండదు. తద్వారా కేసులో నిజానిజాలు బయట పడుతాయంటూ సుశాంత్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
773761 835809What a lovely weblog. I will definitely be back again. Please maintain writing! 758098
695582 842573Wonderful weblog layout here. Was it hard creating a good searching website like this? 156574