ప్రముఖ సినీ నటుడు, ఎస్వీబీసీ ఛానెల్ మాజీ చైర్మన్ పృథ్వీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత పది రోజులుగా ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కరోనా టెస్టులు నిర్వహించగా రిపోర్టులు నెగటివ్ వచ్చాయి. అయితే.. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు పడటంతో ఆయన నిన్న రాత్రి హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ విషయాలు వెల్లడిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
‘పది రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధ పడుతున్నాను. ఇందుకు సంబంధించిన కరోనా టెస్టులు కూడా చేయించాను. ఈ పరిక్షల్లో నెగటివ్ వచ్చింది. సిటీ స్కానింగ్ పరిక్షలు కూడా చేయించాను. అయితే.. కొన్ని కేసుల్లో పాజిటివ్ ఉన్నా నెగటివ్ గా చూపిస్తుందని డాక్టర్లు చెప్పారు. దీంతో డాక్టర్ల సూచన మేరకు ఆసుపత్రిలో చేరి క్వారంటైన్ లో ఉన్నాను. మీ అందరి ఆశీస్సులు, శ్రీ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో త్వరగా కోలుకుంటాను’ అని ఆయన తెలియజేశారు.
30 ఇయర్స్ ఇండస్ట్రీ.. అనే పేరుతో పృథ్వీ బాగా పాపులర్. ఏపీలో వైఎస్సార్సీపీ పార్టీలో చురుగ్గా పని చేశారు. ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పృథ్వీకి ప్రతిష్టాత్మక ఎస్వీబీసీ ఛానెల్ చైర్మన్ పదవి లభించింది. కొన్ని కారణాలతో ఆయన ఆ పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో ఆయన నటిస్తున్నారు.
231423 320403I truly thankful to find this website on bing, just what I was seeking for : D too bookmarked . 880061
254719 955738Can I just now say that of a relief to locate somebody who truly knows what theyre speaking about online. You really know how to bring a difficulty to light and function out it crucial. The diet need to have to see this and appreciate this side on the story. I cant believe youre no more popular since you surely possess the gift. 808798
783794 293646Awesome inkling Grace! ego was luxurious youd bring about this about your biz bump into upstanding lineage. We reason you! 215754